News March 26, 2025

పార్వతీపురం జిల్లాలో చేపట్టిన ప్రగతిని వివరించిన కలెక్టర్

image

అమరావతి రాష్ట్ర సచివాలయంలో బుధవారం జరుగుతున్న 3వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ హాజరయ్యారు. జిల్లాలో చేపడుతున్న ప్రగతిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎంకి కలెక్టర్ వివరించారు. వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక, మత్స్య, పరిశ్రమలు, పర్యాటకం, రైల్వే, రవాణా మొదలగు రంగాల ద్వారా జిల్లాకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Similar News

News November 24, 2025

ఆలయ నిర్మాణాలకు దరఖాస్తులు చేసుకోండి: AC

image

TTD శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గ్రామాల్లో భజన మందిరాల నిర్మాణం కోసం దరఖాస్తులు చేసుకోవాలని దేవాదాయ శాఖ విజయనగరం జిల్లా AC శిరీష ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణ స్థలం ఆధారంగా మందిరాలను టైప్ A, B, Cలుగా విభజించి రూ.10 లక్షల నుండి రూ.20 లక్షల వరకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. స్థల వివరాలు, యజమాని NOCను జతచేసి, దరఖాస్తులను తోటపాలెంలో ఉన్న దేవాదాయ శాఖ కార్యాలయానికి అందజేయాలన్నారు.

News November 24, 2025

BHPL: 61 దరఖాస్థులను స్వీకరించిన అదనపు కలెక్టర్

image

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్థుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం ఐడీవోసీలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, ప్రజల నుంచి 61 దరఖాస్థులను ఆయన స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్థులు పెండింగ్‌ ఉంచకుండా సత్వర పరిష్కారం కల్పనకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

News November 24, 2025

రామసముద్రం యువతి బెంగళూరులో దారుణ హత్య

image

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలానికి చెందిన విద్యార్థిని బెంగళూరులో హత్యకు గురైన ఘటన సోమవారం వెలుగు చూసింది. స్థానికుల వివరాల ప్రకారం.. రామసముద్రం (M) బిక్కంగారిపల్లికి చెందిన దేవిశ్రీ (21) బెంగళూరులో BBA చదువుతోంది. ఈ క్రమంలో విద్యార్థితో చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పెద్ద కొండామర్రికి చెందిన ప్రేమ్ వర్ధన్ పరిచయం పెంచుకున్నాడు. వారి మధ్య ఏం జరిగిందో తెలిదు.. నిన్న రాత్రి హత్య చేసి పరారయ్యాడు.