News March 28, 2025
పార్వతీపురం జిల్లాలో భానుని ప్రతాపం

పార్వతీపురం మన్యం జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. పాచిపెంట, సాలూరు, భామినిలో సహా మిగిలిన మండలాలో రాబోయే 48 గంటలు 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కానుంది. దీంతో ఆ మండల వాసులు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
Similar News
News February 26, 2026
FLNAT పరీక్షకు హాజరుకావాలి: కలెక్టర్

విశాఖలో ఫిబ్రవరి 28న వయోజన విద్యార్థులకు ప్రీ-ఫైనల్ FLNAT పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉల్లాస్, అక్షరాంధ్ర పథకాల కింద 15 ఏళ్లు పైబడిన వారికి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఈ పరీక్ష జరుగుతుంది. 2029 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యమని, అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
News February 26, 2026
పనితీరు ఆధారంగానే టీచర్లకు ప్రమోషన్లు.. విద్యా కమిషన్ ప్రతిపాదన

TG: టీచర్లకు ఆటోమేటిక్ పదోన్నతులు రద్దు చేసి, పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విద్యాకమిషన్ కీలక సూచనలు చేసింది. ఐదేళ్లకోసారి ఉపాధ్యాయుల పనితీరు అంచనా వేయడం తప్పనిసరి చేయాలని, రెండేళ్లలో మెరుగుపడకపోతే సర్వీస్ నుంచి తొలగించేలా నిబంధనలు మార్చాలంది. ఈ నిబంధన ఇకపై నియమించే ఉపాధ్యాయులకు వర్తింపచేయాలని అభిప్రాయపడింది. ఈ మేరకు నివేదికను CM రేవంత్ రెడ్డికి అందజేసింది.
News February 26, 2026
అంకురార్పణతో మొదలైన రంగడి బ్రహ్మోత్సవాలు

నెల్లూరులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీతల్పగిరి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం అంకురార్పణతో మొదలయ్యాయి. ఈ ఉత్సవాలు 26 నుంచి 8 వరకు జరగనున్నాయి. ఆలయ అర్చకులు అంకురార్పణలో భాగంగా పుణ్యాహవాచనం, విశ్వక్సేనారాధన, మృత్ సంగ్రహణ, ఉత్సవమూర్తులకు రక్షాబంధన్, సోమ కుంభ ప్రతిష్ఠ, గరుడ ధ్వజ ప్రతిష్ఠ, అంకురార్పణ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు.


