News February 27, 2025
పార్వతీపురం జిల్లాలో మొదలైన ఓటింగ్

పార్వతీపురం మన్యం జిల్లాలో ఉదయం 8 గంటల నుంచి టీచర్ MLC ఎన్నిక పోలింగ్ మొదలైంది. జిల్లాలో 2,333 మంది టీచర్లు ఇవాళ ఓటు వేసే అవకాశం ఉంది. ఇందులో 1,574 మంది పురుషులు, 759 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పార్వతీపురం మండలంలో ఎక్కువగా 636 మంది, పాచిపెంటలో తక్కువగా 34 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటింగ్ జరిగే ఏరియాలో 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News December 6, 2025
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<
News December 6, 2025
ధర్మపురి: జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా వాహన తనిఖీలు: ఎస్పీ

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలను ముమ్మరంగా చేపట్టనున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపట్నం చెక్ పోస్టును, వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ రావు పేట పోలింగ్ కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించి ఎవరైనా అనుచిత చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 6, 2025
తిరుపతిలో 10వ తేదీన ఇంటర్వ్యూలు

శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS)లో 10వ తేదీన వివిధ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కార్యాలయం పేర్కొంది. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్టు -04, న్యూక్లియర్ మెడిసిన్ రేడియో ఫార్మసిస్ట్-01 మొత్తం 5 పోస్టులకు అవకాశం ఉంది. అర్హత, ఇతర వివరాలకు https://svimstpt.ap.nic.in/jobs.html వెబ్సైట్ చూడొచ్చు.


