News March 14, 2025
పార్వతీపురం జిల్లాలో రేపు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర

జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ సుందర పార్వతీపురం కార్యక్రమంపై సంబంధ అధికారులతో జిల్లా కలెక్టర్ శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సుందర పార్వతీపురం కార్యక్రమంలో ప్రజలు భాగం కావాలని పిలుపునిచ్చారు.
Similar News
News April 19, 2025
కోవెలకుంట్లలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

యువకుల ప్రాణాలను హరించే క్రికెట్ బెట్టింగ్పై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ కే.ప్రమోద్ పేర్కొన్నారు. శనివారం కోవెలకుంట్లలో అదుపులోకి తీసుకున్న క్రికెట్ బెట్టింగ్ ముఠా సభ్యులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. సీఐ హనుమంతు నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు ఆరుగురు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకొని రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రమోద్ వివరించారు.
News April 19, 2025
ఉండి: మహిళ మెడలో గొలుసు అపహరణ

ఉండి రాజుల పేటలో ఉంటున్న అగ్ని మాత్రం వరలక్ష్మి మెడలోని 4 కాసుల బంగారు తాడును శనివారం గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. వరలక్ష్మి గత పది సంవత్సరాలుగా ఉండిలో నివాసం ఉంటుంది. శనివారం వేకువజామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి డోర్ తీసుకొని వచ్చి అటు ఇటు చూస్తుండగా వరలక్ష్మి ఎవరు అని అడగగా, తన నోరునొక్కి మెడలోని బంగారు తాడును లాక్కెళ్లాడు. పోలీసులు విచారణ చేపట్టారు.
News April 19, 2025
ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో అన్ని వరి ధాన్య కొనుగోలు కేంద్రాల్లో సక్రమంగా ధాన్యం సేకరణ చేయాలని, కేంద్రంలో అన్ని సదుపాయాలు కల్పించి, తేమశాతం రాగానే వెంటనే లోడ్ చేసే విధంగా పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఎం. మను చౌదరి అదేశించారు. శనివారం నారాయణరావుపేట మండల కేంద్రంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(ఐకెపి) జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.