News April 13, 2025

పార్వతీపురం: జిల్లాలో 266 యూనిట్ల స్థాపనకు రూ.11.03 కోట్లు

image

పార్వతీపురం జిల్లాలో షెడ్యూల్ కులాల యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు 266 యూనిట్ల స్థాపనకు రూ.11.03 కోట్లు కేటాయించినట్టు కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ శనివారం తెలిపారు. స్వయం ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈనెల 14 నుంచి మే 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. దరఖాస్తులు https://apobmms.apcfss.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్లో సమర్పించాలని సూచించారు.

Similar News

News December 1, 2025

మెదక్: ఈరోజే మంచి రోజు.. అత్యధిక నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో ఈరోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. మెదక్, తూప్రాన్ డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రేపటి వరకు అవకాశం ఉన్నప్పటికీ ఈరోజు ఏకాదశి, మంచి రోజు కావడంతో భారీగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. రేపు చివరి రోజు కావడంతో ద్వాదశి కారణంగా నామినేషన్ వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈరోజే అధికంగా నామినేషన్లు నమోదయ్యే అవకాశం ఉంది.

News December 1, 2025

అల్లూరి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన బంద్.. కానరాని ప్రభావం

image

మారేడుమిల్లిలో జరిగిన ఎన్ కౌంటర్‌కు నిరసనగా ఆదివారం మావోయిస్టులు పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కొయ్యూరు, జీకేవీధి, సీలేరు తదితర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రాజేంద్రపాలెం వారపు సంత యథావిధిగా జరిగింది. పలుచోట్ల దుకాణాలు పనిచేశాయి.ప్రైవేటు వాహనాలు తిరిగాయి. బంద్ ప్రభావం కానరాలేదు.

News December 1, 2025

గ్రామాభివృద్ధికి ఐలయ్య కృషి!

image

MHBD జిల్లా ఇనుగుర్తి పంచాయతీకి ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నికై గ్రామాభివృద్ధి కోసం కృషి చేసిన దివంగత గండు ఐలయ్యకు గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేశారు. 1971 నుంచి 1983 వరకు ఐలయ్య సర్పంచ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ కాలంలో ఆయన గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యాడు.