News February 27, 2025
పార్వతీపురం జిల్లాలో 85.60% పోలింగ్

పార్వతీపురం మన్యం జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు 85.60 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 2,333 మంది టీచర్లకు గాను 1,997 మంది ఓటేశారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
Similar News
News November 18, 2025
బ్రహ్మోత్సవాల్లో రోజుకో చీర.. సీక్రెట్ ఇదే!

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా మొదలయ్యాయి. రోజుకో వాహనంపై అమ్మవారు విహరిస్తారు. ఒక్కో రోజు ఒక్కో రకమైన రంగు చీరలతో అమ్మవారిని అలంకరిస్తారు. కెంపు(ఎరుపు వర్ణం), తెలుపు, పగడపు, ఆకు పచ్చ, పసుపు, నీలం, హేమ వర్ణాల చీరలతో దర్శనమిస్తారు. ఈ వర్ణాల వల్ల అనేక శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. మీరు ఎప్పుడైనా వాహన సేవల్లో ఈ రంగురంగల చీరలను గుర్తించారా..?
News November 18, 2025
బ్రహ్మోత్సవాల్లో రోజుకో చీర.. సీక్రెట్ ఇదే!

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా మొదలయ్యాయి. రోజుకో వాహనంపై అమ్మవారు విహరిస్తారు. ఒక్కో రోజు ఒక్కో రకమైన రంగు చీరలతో అమ్మవారిని అలంకరిస్తారు. కెంపు(ఎరుపు వర్ణం), తెలుపు, పగడపు, ఆకు పచ్చ, పసుపు, నీలం, హేమ వర్ణాల చీరలతో దర్శనమిస్తారు. ఈ వర్ణాల వల్ల అనేక శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. మీరు ఎప్పుడైనా వాహన సేవల్లో ఈ రంగురంగల చీరలను గుర్తించారా..?
News November 18, 2025
మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతం

AP: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతమయ్యాడు. హిడ్మాతో పాటు ఆయన భార్య సహా ఆరుగురు మావోలు మరణించారు. హిడ్మా కోసం పలు రాష్ట్రాల పోలీసులు ఎంతోకాలంగా వెతుకుతున్నారు. ప్రస్తుతం అతడు మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్ సెక్రటరీగా ఉన్నాడు.


