News February 13, 2026

పార్వతీపురం: జిల్లా ఎస్పీ ఆదేశాలు

image

పార్వతీపురం మండలం అడ్డాపుశీల శివాలయం వద్ద మహాశివరాత్రి ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మాధవరెడ్డి గురువారం పరిశీలించారు. పండుగ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రవేశం, క్యూలైన్లు, పార్కింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణపై పలు సూచనలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వం వహించరాదని స్పష్టం చేశారు.

Similar News

News March 9, 2026

వచ్చిన నీరు వచ్చినట్టే పాయే.. గొంతు ఎండనుందా!

image

ఈ ఏడాది వేసవి కాలం జిల్లా ప్రజలకు చుక్కలు చూపించేలా ఉంది. ముఖ్యంగా తాగునీటి విషయంలో గండం పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాకు ప్రధాన నీటి వనరైన నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి లభ్యత ఆశాజనకంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ నెల నుంచి జూన్ వరకు తాగునీటి అవసరాలకే సుమారు 65.49 టీఎంసీలు అవసరం కాగా, నిల్వలు మాత్రం కనిష్ఠ స్థాయికి చేరువలో ఉన్నాయి.

News March 9, 2026

కన్నీళ్లు ఆపుకొని కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్

image

T20WC ఫైనల్‌లో ఆడటం క్రికెటర్ల కల. అలాంటిది ఒక్కరోజు ముందే కుటుంబ సభ్యులను కోల్పోతే వచ్చే దుఃఖం వర్ణనాతీతం. అలాంటి విషాద ఘటన కిషన్ ఇంట నెలకొంది. 7వ తేదీ కారు ప్రమాదంలో అతని కజిన్ సిస్టర్ వైష్ణవి, బావ చనిపోయారు. అయినా కన్నీళ్లు ఆపుకొని కిషన్ నిన్న 54 రన్స్ చేశారు. మ్యాచ్ ఆమె కోసమే ఆడానని, గెలుపు సోదరికి అంకితమన్నారు. బాధను హార్దిక్‌‌తో పంచుకోగా ఈ టైమ్‌లో దేశమే ముఖ్యమని స్ఫూర్తి నింపినట్లు చెప్పారు.

News March 9, 2026

సంగారెడ్డి: అక్టోబర్‌లో 101 ఏళ్ల బర్త్ డే.. మృతి

image

సంగారెడ్డి జిల్లా కంగ్టికి చెందిన శతాధిక వృద్ధురాలు గాదె పారమ్మ (101) ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గత ఏడాది అక్టోబర్‌లో ఆమె కుమారులు, మనమలు, ముని మనమలు కలిసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సుదీర్ఘ జీవిత ప్రయాణాన్ని ముగించి ఆమె మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కంగ్టి సర్పంచ్ కృష్ణ, ముదిరాజ్ సంఘం నాయకులు ఆమె మృతికి సంతాపం తెలిపారు.