News March 15, 2025
పార్వతీపురం జిల్లా పర్యటనకు ప్రత్యేక అధికారి

పార్వతీపురం జిల్లా ప్రత్యేక అధికారిగా డా. భరత్ నారాయణ్ గుప్తాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆయన జిల్లా పర్యటన నిమిత్తం శనివారం జిల్లాకు చేరుకున్నారు. ఆయనను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ స్వాగతం పలికారు. జిల్లాలో జరుగుతున్న ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఆయనకు వివరించారు.
Similar News
News December 1, 2025
శివుడు పుర్రెల దండ ఎందుకు ధరిస్తాడు?

పరమ శివుడు పుర్రెల దండ, చితాభస్మం ధరించి శ్మశానంలో తిరుగుతుంటాడు. అందుకు కారణం శిష్టరక్షణ. అసురులు ధర్మబద్ధంగా వరాలు పొంది దేవతలను హింసించేవారు. వారిని మోహానికి గురి చేయడానికి విష్ణుమూర్తి ఆజ్ఞ మేరకు శివుడు ఈ వేషం ధరించి, పాషండ మతాన్ని ఉపదేశించాడు. దీంతో వేద నింద, దైవ నింద చేసిన రాక్షసుల తేజస్సు క్షీణించింది. అలాగే వారి నుంచి దేవతలకు ఉపశమనం లభించింది. ఇది ధర్మ రక్షణకై హరిహరులు చేసిన లీల.
News December 1, 2025
కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

ప్రయాణికుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా మీదుగా అనకాపల్లి(AKP)-సికింద్రాబాద్(SC) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07041 SC-AKP రైలు డిసెంబర్ 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం, నం.07042 AKP-SC రైలు డిసెంబర్ 8 నుంచి 29 వరకు ప్రతి సోమవారం ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ, గుడివాడ, కైకలూరులో ఆగుతాయని చెప్పారు.
News December 1, 2025
నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కారం: సబ్ కలెక్టర్

నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి అందించే అర్జీలలోని సమస్యలను నిర్ణయిత వ్యవధిలో పరిష్కరించాలని సూచించారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు సకాలంలో హాజరు కావాలన్నారు.


