News January 26, 2025

పార్వతీపురం జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి ప్రశంసాపత్రం

image

పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కే.రాబర్ట్ పాల్‌కు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ప్రశంస పత్రాన్ని అందజేశారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎస్పి ఎస్.వి మాధవ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. సకాలంలో రైతులకు విత్తనాలు అందజేసినందుకుగాను ప్రశంసాపత్రం అందజేశారు.

Similar News

News December 3, 2025

ఇమ్రాన్ ఆరోగ్యంగానే ఉన్నారు కానీ..: ఉజ్మా

image

పాకిస్థాన్ మాజీ ప్రధాని <<18450195>>ఇమ్రాన్<<>> ఖాన్ మరణించారనే ఊహాగానాలకు ఆయన సోదరి ఉజ్మా తెరదించారు. ఆయన అదియాలా జైలులో ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. అయితే ఐసోలేట్ చేయడంపై కోపంగా ఉన్నారని వెల్లడించారు. ఎవరితోనూ ఆయనను కలవనివ్వట్లేదని, ఇది మానసికంగా టార్చర్ చేయడమేనని పేర్కొన్నారు. కొద్ది సమయం సోదరుడితో జరిగిన సమావేశానికి మొబైల్ కూడా అనుమతించలేదని తెలిపారు.

News December 3, 2025

4న చిత్తూరు జిల్లాకు పవన్ రాక..?

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 4న చిత్తూరులో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ పాల్గొననున్నారు. చిత్తూరు డీడీవో కార్యాలయాన్ని ఆయన నేరుగా ప్రారంభిస్తారు. వర్చువల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా డీడీవో కార్యాలయాలను ఓపెన్ చేస్తారు. ఈ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

News December 3, 2025

పాడి రైతులు ఈ విషయం గుర్తుంచుకోవాలి

image

రోజుకు రెండు లీటర్లు పాలిచ్చే 5 ఆవులను పోషించే బదులు.. రోజుకు 10 లీటర్లు పాలిచ్చే ఒక సంకరజాతి ఆవును పోషించడం ఎంతో లాభసాటిగా ఉంటుందని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాడి పశువుల పోషణ వ్యయంలో 60 నుంచి 70 శాతం వ్యయం దాణా, గడ్డి, మందులకే ఖర్చవుతుంది. పాడి పరిశ్రమను లాభసాటిగా సాగించాలంటే పాడి పశువుల మేపుపై అదుపు, సంకరజాతి పశువుల పోషణపై సరైన అవగాహన కలిగి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.