News January 26, 2025

పార్వతీపురం జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి ప్రశంసాపత్రం

image

పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కే.రాబర్ట్ పాల్‌కు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ప్రశంస పత్రాన్ని అందజేశారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎస్పి ఎస్.వి మాధవ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. సకాలంలో రైతులకు విత్తనాలు అందజేసినందుకుగాను ప్రశంసాపత్రం అందజేశారు.

Similar News

News December 6, 2025

‘పదో తరగతి ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి’

image

పదో తరగతిలో విద్యార్థులు ఈ సంవత్సరం నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా మండల విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలోని ఎంఈఓలు ఇతర అధికారులతో కలెక్టర్ శనివాకం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పడంతోపాటు సమాజంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక బాధ్యతను విద్యార్థులకు తెలియజేయాలన్నారు.

News December 6, 2025

వెంకటపురం పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచారం

image

జియ్యమ్మవలస మండలం వెంకటపురం పరిసర గ్రామాల్లో శనివారం ఏనుగుల గుంపు సంచారం చేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. అరటి తోటల్లోకి చొచ్చుకెళ్లిన ఏనుగులు పంట నష్టం కలిగించినట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, రాత్రి వేళల్లో గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.

News December 6, 2025

NTR: Way2News ఎఫెక్ట్.. త్వరలో డయాలసిస్ సెంటర్‌..!

image

ఏ.కొండూరులో 830 మందికి పైగా కిడ్నీ బాధితులు ఉండగా, 4 డయాలసిస్ బెడ్లు మాత్రమే ఉన్నాయి. దీనిపై Way2News <<18484118>>కథనాలు<<>> ప్రచురించింది. స్పందించిన కలెక్టర్ లక్ష్మీశ త్వరలో 12 బెడ్లతో కొత్త డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. జనవరి 1న కిడ్నీ ప్రభావిత గ్రామాలకు <<18457085>>కృష్ణా జలాలు<<>> అందిస్తామన్నారు. బాధితులకు నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణ, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుతామన్నారు.