News March 16, 2025
పార్వతీపురం జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యం కావాలి: కలెక్టర్

పార్వతీపురం జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యం కావాలని జిల్లా ప్రత్యేక అధికారి డా. నారాయణ భరత్ గుప్తా పిలుపునిచ్చారు. శనివారం జిల్లా పర్యటనకు విచ్చేసిన ప్రత్యేక అధికారి కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం స్వర్ణాంధ్ర దిశగా అభివృద్ధి సాధన లక్ష్యంగా అడుగులు వేస్తుందని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సైతం అభివృద్ది దిశగా అడుగులు వేయాలని చెప్పారు.
Similar News
News December 7, 2025
CSIR-CCMBలో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-సెంటర్ ఫర్ సెల్యూలర్ &మాలిక్యులర్ బయాలజీలో 13 సైంటిస్టు పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 9 నుంచి 30 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని జనవరి 6వరకు పోస్ట్ చేయాలి. నెలకు జీతం రూ.1,38,652 చెల్లిస్తారు. పూర్తి స్థాయి నోటిఫికేషన్లో విద్యార్హత, వయసు, పరీక్ష విధానం వెల్లడించనున్నారు. వెబ్సైట్: https://www.ccmb.res.in/
News December 7, 2025
SRPT: తొలి విడత ఉద్యోగులకు 6 నుంచి 9 వరకు పోస్టల్ బ్యాలెట్

సూర్యాపేట జిల్లాలో ఈనెల 11న జరగనున్న మొదటి విడత ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించారు. సంబంధిత మండలాల్లో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న సిబ్బంది ముందస్తుగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
News December 7, 2025
సంగారెడ్డి: గ్లోబల్ సమ్మిట్తో తెలంగాణకు మేలు: నిర్మల

తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ పెట్టుబడులకు కేరాఫ్గా మార్చేందుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నట్లు టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఆదివారం సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పరిశీలించారు. గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.


