News March 16, 2025
పార్వతీపురం జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యం కావాలి: కలెక్టర్

పార్వతీపురం జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యం కావాలని జిల్లా ప్రత్యేక అధికారి డా. నారాయణ భరత్ గుప్తా పిలుపునిచ్చారు. శనివారం జిల్లా పర్యటనకు విచ్చేసిన ప్రత్యేక అధికారి కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం స్వర్ణాంధ్ర దిశగా అభివృద్ధి సాధన లక్ష్యంగా అడుగులు వేస్తుందని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సైతం అభివృద్ది దిశగా అడుగులు వేయాలని చెప్పారు.
Similar News
News October 31, 2025
‘దేశ ఐక్యత, సమగ్రతకు పటేల్ కృషి చిరస్మరణీయం’

దేశ ఐక్యత, సమగ్రతకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన ఆలోచనలు, స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య పాల్గొన్నారు.
News October 31, 2025
సుశాంత్ను ఇద్దరు కలిసి చంపారు: సోదరి శ్వేతా సింగ్

2020లో జరిగిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణంపై సోదరి శ్వేతా సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ది ఆత్మహత్య కాదని, ఇద్దరు కలిసి హత్య చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని US, ముంబైలోని ఇద్దరు సైకిక్స్ వేర్వేరుగా తనకు చెప్పారన్నారు. ‘సుశాంత్ బెడ్, ఫ్యాన్ మధ్య దూరాన్ని బట్టి అతను ఉరేసుకుని చనిపోయే అవకాశమే లేదు. మెడపై దుపట్టా మార్క్ కాకుండా ఒక చిన్న చెయిన్ ముద్ర మాత్రమే కనిపించింది’ అని పేర్కొన్నారు.
News October 31, 2025
NZB: కల్వల మత్తడి మరమ్మతులు వెంటనే చేపట్టాలి: కవిత

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కల్వల మత్తడి మరమ్మతులను వెంటనే చేపట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. కల్వల ప్రాజెక్టును ఆమె శుక్రవారం సందర్శించారు. మత్తడి కొట్టుకుపోయి 3 ఏళ్లు అవుతోందన్నారు. మరమ్మతులకు గత ప్రభుత్వమే రూ.70 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు బాగు చేయించలేదన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 6 వేల ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు.


