News November 2, 2024

పార్వతీపురం: తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్య

image

తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పార్వతీపురం పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. తూడి గ్రామానికి చెందిన కొనిశ శివ(27) తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిందని రైల్వే HC దేశాబత్తుల రత్నకుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News December 9, 2025

డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ నలుగురికి జైలుశిక్ష: VZM SP

image

విజయనగరం ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురికి కోర్టు జైలు శిక్ష విధించిందని ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. పట్టుబడ్డవారిని కోర్టులో హాజరుపర్చగా.. ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జి 20, 15, 6, 5 రోజుల చొప్పున జైలు శిక్ష విధించారన్నారు. రహదారి ప్రమాదాల నియంత్రణలో భాగంగా జిల్లాలో ఆకస్మిక డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతాయని ఎస్పీ దామోదర్ చెప్పారు.

News December 9, 2025

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఉపాధి హమీ పథకం కీలకం: మంత్రి కొండపల్లి

image

MGNREGS పనుల అమలుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన ఛాంబర్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఈ పథకం కీలకమని ఆయన పేర్కొన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ పనుల పురోగతి, బిల్లుల చెల్లింపుల స్థితిని అధికారులతో సమీక్షించారు. సమావేశంలో పీడీ శారదాదేవి, ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ రత్నకుమార్, రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

News December 9, 2025

VZM: కలెక్టర్‌కు CPS ఉద్యోగుల వినతి పత్రం అందజేత

image

విజయనగరం జిల్లా CPS ఉద్యోగులు తమ డిమాండ్లపై కలెక్టర్‌కు మంగళవారం వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కావచ్చనా CPS ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని వారు పేర్కొన్నారు. తక్షణమే CPS రద్దు చేయాలని, గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయాలని, డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా”చైతన్య యాత్ర”నిర్వహిస్తున్నామని బాజీ పటాన్ చెప్పారు.