News February 28, 2025

పార్వతీపురం: తాను చనిపోయినా..!

image

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండల కేంద్రం గొల్ల వీధికి చెందిన కొల్లి రవణ బ్రెయిన్ స్ట్రోక్‌తో గురువారం సాయంత్రం మృతిచెందారు. అంతటి విషాదంలోనూ ఆయన కుటుంబ సభ్యులు మంచి మనసు చాటుకున్నారు. విశాఖపట్నానికి చెందిన ఓ ఐ బ్యాంకుకు రెండు కళ్లను దానం చేశారు. రవణ తాను చనిపోయి మరొకరికి చూపు ప్రసాదించారని పలువురు కొనియాడారు.

Similar News

News December 4, 2025

భద్రాద్రి: 3వ విడత తొలిరోజు అందిన నామినేషన్లు

image

3వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం 7 మండలాల నుంచి నామినేషన్లు స్వీకరించారు. మండలాల వారీగా బుధవారం అందిన సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్లు ఇలా. ఆళ్లపల్లి – 1, 2, గుండాల – 3, 3, జూలూరుపాడు – 5, 4, లక్ష్మీదేవిపల్లి – 4, 7, సుజాతనగర్ – 3, 1, టేకులపల్లి – 19, 7, ఇల్లందు – 6, 6.. 155 గ్రామపంచాయతీలకు గాను 41 సర్పంచ్, 30 వార్డు సభ్యులు నామినేషన్ దాఖలు చేశారని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు

News December 4, 2025

థైరాయిడ్‌ ట్యూమర్స్‌ చికిత్స

image

థైరాయిడ్‌ ట్యూమర్స్‌ వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేసి ఏ రకమైన కణితో తెలుసుకుంటారు. అలా తెలియకపోతే నీడిల్‌ ద్వారా కణితిలోని కొన్ని కణాలను బయటికి తీసి, మైక్రోస్కోప్‌లో పరీక్షిస్తారు. థైరాయిడ్‌ కణితి 3 సెం.మీ. కన్నా పెద్దగా ఉండి, ఆహారం తీసుకున్నప్పుడు ఇబ్బందికరంగా ఉంటే సాధారణంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి నాన్‌ సర్జికల్‌ ట్రీట్‌మెంట్‌/ సర్జికల్ ట్రీట్‌మెంట్ చేస్తారు.

News December 4, 2025

VZM: హోంమంత్రి అధ్యక్షతన నేడు DRC సమావేశం

image

విజయనగరం కలెక్టరేట్‌లో బుధవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మినిస్టర్ వంగలపూడి అనిత అధ్యక్షత వహించనున్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ శాఖల ప్రగతి, ప్రజా సేవల అమలు స్థితి, సంక్షేమ పథకాల పురోగతి వంటి అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించనున్నారు.