News February 23, 2025
పార్వతీపురం: నకిలీ పోలీస్ అరెస్ట్

విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పోలీస్ను సీఐ ఉమామహేశ్వరరావు శనివారం అరెస్ట్ చేశారు. NAD, శాంతినగర్ పార్క్ ఏరియాలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పార్వతీపురం ప్రాంతానికి చెందిన నిందుతుడు బోను దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రెండు నకిలీ పోలీసు గుర్తింపు కార్డులు, బెదిరించి దోచుకున్న స్కూటీతో పాటు ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేసి రిమాండ్కు తరలించారు.
Similar News
News December 4, 2025
సిద్దిపేట: ల్యాబ్ టెక్నీషియన్లతో డీఎంహెచ్ఓ సమావేశం

సిద్దిపేట జిల్లాలో జిల్లా వైద్యాధికారి సీహెచ్ ధన్ రాజ్ ఆధ్వర్యంలో జిల్లాలోని లాబ్ టెక్నిషియన్స్ నెలవారి సమీక్ష సమావేశం డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి PHC, CHC, జిల్లా HOSPITALలలో పేషంట్స్కి నిర్వహించే పరీక్షలలో ఎలాంటి అలసత్వాన్ని లేకుండా నిర్వహించాలని, సకాలంలో రిపోర్ట్స్ అందించాలని ఆదేశించారు.
News December 4, 2025
ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం: కందుల

ఆంధ్రప్రదేశ్ లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. గురువారం రాజమండ్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ సినిమాస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాజమండ్రి నగరం పర్యాటకం, సంస్కృతి & వినోద రంగాల్లో మరింత అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
News December 4, 2025
HYD: త్రివిధ దళాల్లో నౌకాదళం శక్తిమంతం: రంగారావు

త్రివిధ దళాల్లో నౌకాదళం శక్తివంతమైందని, దేశ రక్షణలో కీలకమని నేవీ విశ్రాంత ఆఫీసర్ DP రంగారావు అన్నారు. ‘1969-80 వరకు పని చేశాను. 1971 WARలో ఉన్నాను. 1970-76లో ఒకే షిప్లో 6 ఏళ్లు 28 దేశాలు ప్రయాణించాను. 1976లో INS వీరబాహు సబ్ మెరైన్ బేస్ మెయింటెనెన్స్ మెరైన్ ఇంజినీర్గా విధులు నిర్వహించాను. సంగ్రామ్ మెడల్, పశ్చిమ స్టార్ మెడల్స్ అందుకున్నాను’ అని నేవీ డే వేళ హయత్నగర్లో ఆయన Way2Newsతో మాట్లాడారు.


