News March 13, 2025

పార్వతీపురం: నేడు ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు

image

పార్వతీపురం మన్యంలో గురువారం ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. వడగాల్పుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.

Similar News

News October 25, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి

News October 25, 2025

సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి..!

image

సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి కుమారుడు విపుల్ రెడ్డి వివాహ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా, సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం విశేషం. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖ రాజకీయ నాయకులు, అధికార వర్గాలు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

News October 25, 2025

కామారెడ్డి: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

ప్యాసింజర్ రైల్లో గుర్తు తెలియని మృతదేహం లభించినట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు. గుంటూరు నుంచి మెదక్ వెళ్తున్న ప్యాసింజర్ రైలులో సుమారు 45 సంవత్సరాలు గల వ్యక్తి మృతి చెంది ఉండగా పలువురు సమాచారం అందించినట్లు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. మృతుని వివరాలు తెలియవలసి ఉన్నాయని ఆయన చెప్పారు.