News December 26, 2024
పార్వతీపురం: నేడు విద్యా సంస్థలకు సెలవు
తుఫాన్ ప్రభావంతో పార్వతీపురం జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని పాఠశాలకు గురువారం సెలవు ప్రకటించినట్లు డీఈవో ఎన్.టీ.నాయుడు తెలిపారు. కలెక్టర్ ఆదేశాలు మేరకు డీవైఈవోలు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు తెలియజేస్తున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా క్లాసులు నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 24, 2025
VZM: జిల్లాలో 431 గోకులాల నిర్మాణం పూర్తి: కలెక్టర్
జిల్లాలో మొదటి విడతలో భాగంగా 996 గోకులాలు మంజూరు చేయగా, వీటిలో 431 నిర్మాణాలు పూర్తయ్యాయని కలెక్టర్ అంబేడక్కర్ తెలిపారు. సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మిగిలిన నిర్మాణాలు పూర్తి చేయాల్సిన బాధ్యత డ్వామా APOలపై ఉందని స్పష్టం చేశారు. రెండో విడత కింద ఫిబ్రవరి మొదటి వారంలో మరో 1000 గోకులాల నిర్మాణాలు ప్రారంభించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న రూ. 2 కోట్ల బిల్లులు అప్లోడ్ చేయాలన్నారు.
News January 24, 2025
గజపతినగరం: మంత్రి కొండపల్లి రేపటి షెడ్యూల్ ఇదే
రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం నాటి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 8 గంటలకు గజపతినగరం టీడీపీ కార్యాలయంలో దత్తిరాజేరు నాయకులతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 2:00 గంటలకు దత్తిరాజేరు MPDO కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 3:30 గంటలకు చామలవలస గ్రామంలో పర్యటించి సాయంత్రం 5 గంటలకు విశాఖ వెళ్తారని మంత్రి కార్యాలయం తెలిపింది.
News January 23, 2025
ఆనందంగా గడిపారు.. అంతలోనే విషాదం
అగనంపూడి టోల్గేట్ వద్ద జరిగిన ప్రమాదంలో <<15230832>>మృతి చెందిన<<>> గొర్లి మన్మథరావు(38), అరుణ కుమారి (32) సంక్రాంతికి పిల్లలతో కలిసి గడిసింగుపురం వచ్చారు. గ్రామంలో ఆనందంగా గడిపిన వారు.. కనుమ మరుసటి రోజే పయనమయ్యారు. ఫార్మాసిటీలో వెల్డర్గా పనిచేస్తున్న మన్మథరావు బుధవారం సెలవు పెట్టి భార్యతో కలిసి బ్యాంకుకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.