News January 28, 2025
పార్వతీపురం: ‘పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు నిర్వహించాలి’

జిల్లాలో మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని DRO కె.హేమలత సంబంధిత అధికారులను అదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై డీఆర్ఓ అధ్యక్షతన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ఇంటర్మీడియట్ విద్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని 34 పరీక్షా కేంద్రాలల్లో పరీక్షలు నిర్వహిస్తమన్నారు.
Similar News
News January 6, 2026
పోలవరంపై సీఎం డెడ్లైన్.. నిపుణుల ఏమంటున్నారంటే..!

2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే కీలకమైన డయాఫ్రమ్ వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణాలకు సమయం పడుతుందని, గడువులోగా పూర్తి చేయడం అసాధ్యమని ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు చేయాల్సి ఉన్నందున అధికారులు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. కాగా 7వ తేదీన చంద్రబాబు పోలవరం రానున్న సంగతి తెలిసిందే.
News January 6, 2026
వారేవా.. HCUకు అంతర్జాతీయ గుర్తింపు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. వర్సిటీకి చెందిన సీనియర్ ప్రొ.అనిల్ కుమార్ చౌదరి, స్కాలర్ చందన్ ఘోరుయీ పేలుడు పదార్థాలను గుర్తించి ప్రమాదాల నివారించే పరికరాన్ని రూపొందించారు. 0.3 టెరాహెట్జ్ రాడార్ వ్యవస్థను తయారుచేశారు. ఇది పేలుడు పదార్థాలను, లోహాలను గుర్తించి ప్రమాదాలను నివారిస్తుంది. వీరి పరిశోధన వివరాలు అంతర్జాతీయ IEEE సెన్సార్ జర్నల్లో ప్రచురించారు.
News January 6, 2026
చెక్ బౌన్స్ సమన్లు.. వాట్సాప్లోనూ పంపొచ్చు: ఉత్తరాఖండ్ హైకోర్టు

చెక్ బౌన్స్ కేసులకు సంబంధించిన సమన్లపై ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఫిజికల్గానే కాకుండా ఇకపై ఈమెయిల్, వాట్సాప్ లాంటి మెసేజింగ్ అప్లికేషన్లు, మొబైల్ ఫోన్ ద్వారా కూడా సమన్లను పంపవచ్చని స్పష్టం చేసింది. ఫిర్యాదుదారు నిందితుడి వ్యక్తిగత ఈమెయిల్, వాట్సాప్ వివరాలను అఫిడవిట్ ద్వారా సమర్పించాలని పేర్కొంది. ఆటోమేటిక్గా సమన్లు వెళ్లేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేయాలని అధికారులకు సూచించింది.


