News March 29, 2025
పార్వతీపురం: పదవ తరగతి విద్యార్థులకు అలెర్ట్

ఈనెల 31వ తేదిన జరగబోయే పదవ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్ష ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించడం జరుగుతుందని DEO ఎన్. తిరుపతి నాయుడు శనివారం తెలిపారు. ప్రభుత్వం ఈనెల 31న రంజాన్ సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు మార్పు చేసినట్టు తెలిపారు. కావున పరీక్షా సిబ్బంది అందరూ గమనించి, అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని విద్యార్థులందరికీ తెలియజేయాలని సూచించారు.
Similar News
News December 2, 2025
కాకినాడ: ‘చంపేసి పారిపోయాడు.. ఇతను కనిపిస్తే చెప్పండి’

కాకినాడ రూరల్ ఇంద్రపాలేనికి చెందిన బేతా గంగరాజు (52) తన భార్యను గత నెల 30న హత్య చేసి పరారయ్యాడని ఇంద్రపాలెం ఎస్ ఐ వీరబాబు తెలిపారు. అతని ఆచూకీ తెలిసినవారు పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఎస్ఐ ఫోన్ 9440796521, సీఐ 9440796555 కు సమాచారం ఇవ్వాలన్నారు.
News December 2, 2025
ADB: అసలు మీరు ఏ వర్గం రా బాబూ..!

పంచాయతీ ఎన్నికల వేళ పార్టీలోకి ఫిరాయింపులు, చేరికలు జోరందుకున్నాయి. పలువురు నాయకులు ఓవైపు అధికార పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతూ, మరోవైపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నాయకులతో అంట కాగుతున్నారు. ఉదయం ఒక పార్టీ కండువా వేసుకుని.. సాయంత్రం మరో పార్టీలో చేరుతున్న ఘటనలు చేసుకుంటున్నాయి. ఇది చూసిన పలువురు మీరు ఏ వర్గం రా బాబు అంటూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మీ ప్రాంతంలోనూ ఇలాగే జరుగుతోందా కామెంట్ చేయండి.
News December 2, 2025
HYD: సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి స్లాట్స్

సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి రోజురోజుకు పెరిగిపోతుంది. అవినీతిని అరికట్టేందుకు తెచ్చిన స్లాట్ బుకింగ్ను అక్రమార్కులు తమ దందాకు వాడుకుంటున్నారు. HYD పరిధిలోని 45 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇది సాగుతోంది. లాగిన్ ఐడీలను క్రియేట్ చేసి అవసరం లేకుండా స్లాట్ బుక్ చేస్తున్నారు. అత్యవసరంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి నుంచి ఎక్కువ డబ్బులు లాగుతూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ప్రజలు తెలిపారు.


