News March 29, 2025
పార్వతీపురం: పదవ తరగతి విద్యార్థులకు అలెర్ట్

ఈనెల 31వ తేదిన జరగబోయే పదవ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్ష ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించడం జరుగుతుందని DEO ఎన్. తిరుపతి నాయుడు శనివారం తెలిపారు. ప్రభుత్వం ఈనెల 31న రంజాన్ సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు మార్పు చేసినట్టు తెలిపారు. కావున పరీక్షా సిబ్బంది అందరూ గమనించి, అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని విద్యార్థులందరికీ తెలియజేయాలని సూచించారు.
Similar News
News November 26, 2025
ASF జిల్లాలో డిసెంబర్ 1 నుంచి పరీక్షలు

ASF జిల్లాలో డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు 2024-25 బ్యాచ్ అభ్యర్థులకు, గత బ్యాచ్లో అనుతీర్ణులైన అభ్యర్థులకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి దీపక్ తివారి తెలిపారు. పరీక్ష నిర్వహణ కోసం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
News November 26, 2025
నల్గొండ: పౌరులందరి హక్కులకు రాజ్యాంగం రక్ష: ఇన్ఛార్జ్ డీఆర్ఓ

భారత రాజ్యాంగం దేశంలోని పౌరులందరి హక్కులకు రక్షణ కల్పిస్తుందని ఇన్ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి వై.అశోక్ రెడ్డి అన్నారు. నల్గొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన మౌలిక హక్కులు, బాధ్యతలు ప్రతి పౌరుడు తప్పనిసరిగా తెలుసుకొని, వాటిని ఆచరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
News November 26, 2025
AI చెప్పిన.. టాలీవుడ్ టాప్ హీరోలు వీరే

ఏఐ చాట్బోట్లయిన జెమిని, చాట్ Gpt, గ్రోక్లు టాలీవుడ్లో నంబర్ 1 హీరో డార్లింగ్ ప్రభాస్ అని ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని సినీవర్గాలు తెలిపాయి. gemini: ప్రభాస్, అల్లు అర్జున్, NTR, రామ్ చరణ్, మహేశ్ బాబు. – Chatgpt: ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, NTR, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ – Grok- ప్రభాస్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, NTR, రామ్ చరణ్, పవన్. మరి మీ దృష్టిలో టాప్-6 టాలీవుడ్ హీరోలెవరు?COMMENT


