News March 19, 2025
పార్వతీపురం: పదవ తరగతి హిందీ పరీక్షకు 48 మంది గైర్హాజరు

పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం నిర్వహించిన పదవ తరగతి హిందీ పరీక్షకు 48 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తిరుపతి నాయుడు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. 10,367 మంది విద్యార్థులకు 10,319 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 38 పరీక్ష కేంద్రాల్లో శతశాతం హజరు నమోదైందని జిల్లా వ్యాప్తంగా 99.53 శాతం హాజరు నమోదుదైనట్లు తెలిపారు,
Similar News
News October 17, 2025
బాపట్ల: జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు అందించాలి

జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ డా.వి.వినోద్కుమార్. బాపట్లలో జరిగిన గ్రామీణ నీటి సరఫరా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం 1.48 లక్షల గృహాలకు మాత్రమే కొళాయి కనెక్షన్లు ఉన్నాయని, మిగిలిన 2.15 లక్షల గృహాలకు డిసెంబర్లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రూ.167.48 కోట్లతో 403 పనులు జరుగుతుండగా, ఆలస్యం చేసిన ఏజెన్సీలకు నోటీసులు ఇవ్వాలని హెచ్చరించారు.
News October 17, 2025
HYD: రేపు బంద్.. మరి వైన్స్ టెండర్లు..?

రేపు బీసీ సంఘాలు తెలంగాణ బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వైన్స్ టెండర్లకు ఎటువంటి అడ్డంకి ఉండదని, సెంటర్లు యథావిధిగా కొనసాగుతాయని DPEO ఉజ్వల రెడ్డి ఈరోజు HYDలో తెలిపారు. రేపటితో వైన్స్ టెండర్ల ప్రక్రియ ముగియనున్నట్లు చెప్పారు. రేపు సా.5 గంటల్లోపు సెంటర్లో ఉన్న వారి అప్లికేషన్లు మాత్రమే స్వీకరిస్తామని తెలిపారు. రేపు చివరి రోజు కావడంతో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.
News October 17, 2025
HYD: రేపు బంద్.. మరి వైన్స్ టెండర్లు..?

రేపు బీసీ సంఘాలు తెలంగాణ బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వైన్స్ టెండర్లకు ఎటువంటి అడ్డంకి ఉండదని, సెంటర్లు యథావిధిగా కొనసాగుతాయని DPEO ఉజ్వల రెడ్డి ఈరోజు HYDలో తెలిపారు. రేపటితో వైన్స్ టెండర్ల ప్రక్రియ ముగియనున్నట్లు చెప్పారు. రేపు సా.5 గంటల్లోపు సెంటర్లో ఉన్న వారి అప్లికేషన్లు మాత్రమే స్వీకరిస్తామని తెలిపారు. రేపు చివరి రోజు కావడంతో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.