News March 19, 2025
పార్వతీపురం: పదవ తరగతి హిందీ పరీక్షకు 48 మంది గైర్హాజరు

పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం నిర్వహించిన పదవ తరగతి హిందీ పరీక్షకు 48 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తిరుపతి నాయుడు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. 10,367 మంది విద్యార్థులకు 10,319 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 38 పరీక్ష కేంద్రాల్లో శతశాతం హజరు నమోదైందని జిల్లా వ్యాప్తంగా 99.53 శాతం హాజరు నమోదుదైనట్లు తెలిపారు,
Similar News
News December 9, 2025
TPT: ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం.. ఫోన్పే చేయడంతోనే!

తిరుపతిలో ర్యాపిడో డ్రైవర్ సాయికుమార్ ఓ బాలికను అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ర్యాపిడో బుక్ చేసినప్పుడు ఆ బాలిక ఫోన్ పే ద్వారా నగదు చెల్లించింది. ఆ నంబర్తో బాలికకు కాల్ చేసి ప్రేమిస్తున్నానని చెప్పగా ఆమె నిరాకరించింది. తర్వాత సాయి కుమార్ తన అక్కతో ఫోన్ మాట్లాడించాడు. ఫ్రెండ్స్గా ఉందామని.. ఏ అవసరం వచ్చినా కాల్ చేయడమన్నాడు. దీంతో బాలిక సాయం అడిగితే తీసుకెళ్లి అత్యాచారం చేశాడని సమాచారం.
News December 9, 2025
మహిళా పోలీసులకు కొత్త బాధ్యతలు: విశాఖ సీపీ

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి 430 మంది మహిళా పోలీసులతో మంగళవారం సమావేశయ్యారు. ఈ కార్యక్రమంలో వారి విధులను ఖరారు చేశారు. ఇకపై రెగ్యులర్ పోలీసులతో కలిసి పనిచేసేలా డేటా ఎంట్రీ, దర్యాప్తు సాయం, కౌన్సెలింగ్, సమాచార సేకరణ వంటి 10 రకాల కీలక బాధ్యతలను వారికి ప్రతిపాదించారు. బదిలీలు, ఐడీ కార్డుల సమస్యలను పరిష్కరిస్తామని సీపీ హామీ ఇచ్చారు.
News December 9, 2025
విశాఖలో జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీలు ప్రారంభం

విశాఖ వేదికగా 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభించారు. ఒలింపిక్స్ పతకాలే లక్ష్యంగా క్రీడాకారులు రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. ముడసర్లోవలో కొత్త స్కేటింగ్ రింక్ నిర్మిస్తామని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఎమ్మెల్యేలు పాల్గొనగా, అంతర్జాతీయ స్కేటర్ ఆనంద్ కుమార్ను ఘనంగా సత్కరించారు.


