News March 19, 2025
పార్వతీపురం: పదవ తరగతి హిందీ పరీక్షకు 48 మంది గైర్హాజరు

పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం నిర్వహించిన పదవ తరగతి హిందీ పరీక్షకు 48 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తిరుపతి నాయుడు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. 10,367 మంది విద్యార్థులకు 10,319 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 38 పరీక్ష కేంద్రాల్లో శతశాతం హజరు నమోదైందని జిల్లా వ్యాప్తంగా 99.53 శాతం హాజరు నమోదుదైనట్లు తెలిపారు,
Similar News
News December 7, 2025
జనగామ: గుర్తులు ఖరారు!

జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు శనివారం ప్రకటించారు. వార్డు మెంబర్, సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. దీంతో పోటీదారులు తమకు కేటాయించిన గుర్తులతో ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. పంచాయతీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది.
News December 7, 2025
కృష్ణా జిల్లాలో వరి కోతలు ప్రారంభం.. కూలీలకు ఉపాధి.!

దిత్వా తుఫాన్ అనంతరం వాతావరణం అనుకూలించడంతో జిల్లాలో వరి కోత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షాల కారణంగా యంత్రాలపై ఆధారపడటంతో కూలీలకు ఉపాధి నిలిచిపోయింది. అయితే, ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో రైతులు యంత్రాల వినియోగాన్ని తగ్గించి, తిరిగి కూలీలతో వరి కోతలను ప్రారంభిస్తున్నారు. దీంతో నిలిచిపోయిన కూలీలందరికీ మళ్లీ ఉపాధి లభించే అవకాశం ఏర్పడింది.
News December 7, 2025
హాజీపూర్: ఉద్యోగం వదిలి.. సర్పంచ్ బరిలో

హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామానికి చెందిన మనుబోతుల అలేఖ్య సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. హైదరాబాద్లోని HDFC బ్యాంక్లో సేల్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్గా మంచి ఉద్యోగాన్ని చేస్తున్న ఆమె, గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలనే పట్టుదలతో ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు. ప్రస్తుతం గిరిజన గ్రామమైన ర్యాలీ గ్రామ పంచాయితీ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. ఆమె నిర్ణయం గ్రామంలోని యువతకు ఆదర్శంగా నిలిచింది.


