News March 19, 2025

పార్వతీపురం: పదవ తరగతి హిందీ పరీక్షకు 48 మంది గైర్హాజరు

image

పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం నిర్వహించిన పదవ తరగతి హిందీ పరీక్షకు 48 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తిరుపతి నాయుడు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. 10,367 మంది విద్యార్థులకు 10,319 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. 38 పరీక్ష కేంద్రాల్లో శతశాతం హజరు నమోదైందని జిల్లా వ్యాప్తంగా 99.53 శాతం హాజరు నమోదుదైనట్లు తెలిపారు,

Similar News

News November 21, 2025

లీజుకు బంగారం.. ఇప్పుడిదే ట్రెండ్-1

image

అంతర్జాతీయ ఉద్రిక్తతలు, పండుగల సీజన్ నేపథ్యంలో ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో బడా ఇన్వెస్టర్లు కొత్త ట్రెండ్‌కు తెరతీశారు. తమ వద్ద ఉన్న బంగారాన్ని అద్దె/లీజుకు ఇస్తున్నారు. బంగారు బిస్కెట్లు, కడ్డీలు వంటి వాటిని ఆభరణాల వ్యాపారులు, రిఫైనర్లు, తయారీదారులకు ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. తద్వారా బంగారంపై 2-7% ఆదాయం పొందుతున్నారు. ఇటు ధరల పెరుగుదల, అటు లీజ్ ద్వారా లాభపడుతున్నారు.

News November 21, 2025

లీజుకు బంగారం.. ఇప్పుడిదే ట్రెండ్-2

image

పెట్టుబడిదారులు తొలుత బంగారాన్ని లీజింగ్ ప్లాట్‌ఫామ్ లేదా ఆర్థిక సంస్థకు ఇస్తారు. ఆ సంస్థ నుంచి గోల్డ్‌ను జువెలర్లు తీసుకుని ఆభరణాలు తయారు చేసి అమ్ముకుంటారు. ఇన్వెస్టర్లకు లీజ్ రేట్ ప్రకారం డబ్బు చెల్లిస్తారు. గడువు పూర్తయ్యాక బంగారాన్ని ఇన్వెస్టర్లకు తిరిగి ఇస్తారు. లేదా లీజ్ రెన్యూవల్ చేసుకుంటారు. అయితే జువెలర్లు దివాళా తీస్తే గోల్డ్ రికవరీ కష్టమవుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News November 21, 2025

నిర్మల్ జిల్లాలో 13 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు

image

నిర్మల్ జిల్లాలో 13 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి సోయాబీన్ సేకరణ చేపట్టనున్నట్లు మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ మహేష్ కుమార్ గురువారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 7.62 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాల్ లకు పరిమితిని పెంచిందని వెల్లడించారు. కావున రైతులు గమనించి సోయాబీన్ ను 12% తేమ ఉండేటట్లు ఎండబెట్టి ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.5328 పొందవచ్చని సూచించారు.