News February 28, 2025
పార్వతీపురం: పశు వైద్య భవనాలకు మరమ్మతులు

పార్వతీపురం మన్యం జిల్లాలోని పాడైన పశు వైద్య భవనాలకు మరమ్మతులు, అవసరమైన నూతన భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపామని జిల్లా పశు సంవర్ధక అధికారి డా.ఎస్.మన్మధరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 7 పశు వైద్య శాలలు, 38 పశు వైద్య శస్త్ర చికిత్సాలయాలు, 35 గ్రామీణ పశు వైద్య కేంద్రాల ద్వారా పశు వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News October 17, 2025
చిత్త కార్తె.. వ్యవసాయ సామెతలు

✍️ చిత్త కురిస్తే చింతలు కాయును
✍️ చిత్త చినుకు తన చిత్తమున్న చోట పడును
✍️ చిత్తలో చల్లితే చిత్తుగా పండును
✍️ చిత్త, స్వాతుల సందు చినుకులు చాలా దట్టం
* రబీ పంటలకు చిత్త కార్తెలో పడే వానలు చాలా కీలకం. అందుకే ఆ కార్తె ప్రాధాన్యతను వెల్లడిస్తూ రైతులు ఈ సామెతలను ఉపయోగించేవారు.
* మీకు తెలిసిన వ్యవసాయ సామెతలను కామెంట్ చేయండి.
<<-se>>#AgricultureProverbs<<>>
News October 17, 2025
వనపర్తి: మున్సిపల్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

జిల్లా కేంద్రంలోని నల్లచెరువు ట్యాంక్ బండ్పై సుందరీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన సామగ్రిని, మొక్కలను సంరక్షించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నల్లచెరువు ట్యాంక్ బండ్తో పాటు, ఇండోర్ స్టేడియంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్యాంక్ బండ్కు ఇరువైపులా ఆర్చితోపాటు గేటు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
News October 17, 2025
ఈ స్వీట్ KGకి రూ.1.11లక్షలు

సాధారణంగా స్వీట్స్ కేజీకి రూ.2వేల వరకూ ఉండటం చూస్తుంటాం. కానీ జైపూర్ (రాజస్థాన్)లో అంజలి జైన్ తయారుచేసిన ‘స్వర్ణ ప్రసాదమ్’ స్వీట్ KG ధర ₹1.11 లక్షలు. దీనిని చిల్గోజా, కుంకుమపువ్వు, స్వర్ణ భస్మంతో తయారుచేసి బంగారం పూతతో అలంకరించారు. బంగారు భస్మం రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని ఆయుర్వేదంలో ఉందని ఆమె తెలిపారు. అలాగే స్వర్ణ్ భస్మ భారత్ (₹85,000/కిలో) & చాంది భస్మ భారత్ (₹58,000/కిలో) కూడా ఉన్నాయి.