News February 28, 2025

పార్వతీపురం: పశు వైద్య భవనాలకు మరమ్మతులు

image

పార్వతీపురం మన్యం జిల్లాలోని పాడైన పశు వైద్య భవనాలకు మరమ్మతులు, అవసరమైన నూతన భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపామని జిల్లా పశు సంవర్ధక అధికారి డా.ఎస్.మన్మధరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 7 పశు వైద్య శాలలు, 38 పశు వైద్య శస్త్ర చికిత్సాలయాలు, 35 గ్రామీణ పశు వైద్య కేంద్రాల ద్వారా పశు వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

Similar News

News December 6, 2025

రేపు రాత్రిలోపు రీఫండ్ చేయండి.. ఇండిగోకు కేంద్రం ఆదేశం

image

టికెట్లు రద్దయిన ప్రయాణికులందరికీ ఆలస్యం లేకుండా రీఫండ్‌ చేయాలని ఇండిగోను కేంద్ర విమానయాన సంస్థ ఆదేశించింది. అందుకు రేపు రాత్రి 8 గంటల వరకు గడువు విధించింది. ప్రయాణికులకు ఎలాంటి రీషెడ్యూలింగ్ ఛార్జీలు విధించవద్దని స్పష్టం చేసింది. రీఫండ్ ప్రాసెస్‌లో అలసత్వం వహిస్తే తక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. అటు ఇవాళ కూడా ఇండిగోకు చెందిన వందల ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి.

News December 6, 2025

వడ్లమానులో గుర్తుతెలియని మృతదేహం కలకలం

image

ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో గుర్తుతెలియని వృద్ధుని మృతదేహం శనివారం కలకలం సృష్టించింది. స్థానికుల సమాచారంతో ఎస్సై శుభశేకర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామంలోని ఓ ప్రైవేటు నర్సరీకి సమీపంలో గుర్తు తెలియని 65 ఏళ్ల వయోవృద్ధుడు మృతి చెంది ఉండడంతో వీఆర్ఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

News December 6, 2025

సైబర్ మోసాల నుంచి రక్షణకు గూగుల్ కొత్త ఫీచర్

image

సైబర్ మోసాల బారిన పడి రోజూ అనేకమంది ₹లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఎక్కువగా మొబైల్ యూజర్లు నష్టపోతున్నారు. దీనినుంచి రక్షణకు GOOGLE ఆండ్రాయిడ్ ఫోన్లలో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ‘ఇన్-కాల్ స్కామ్ ప్రొటెక్షన్’ అనే ఈ ఫీచర్ ఆర్థిక లావాదేవీల యాప్‌లు తెరిచినప్పుడు, సేవ్ చేయని నంబర్ల కాల్స్ సమయంలో పనిచేస్తుంది. మోసపూరితమైతే స్క్రీన్‌పై హెచ్చరిస్తుంది. దీంతో కాల్ కట్ చేసి మోసం నుంచి బయటపడే అవకాశముంది.