News February 28, 2025
పార్వతీపురం: పశు వైద్య భవనాలకు మరమ్మతులు

పార్వతీపురం మన్యం జిల్లాలోని పాడైన పశు వైద్య భవనాలకు మరమ్మతులు, అవసరమైన నూతన భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపామని జిల్లా పశు సంవర్ధక అధికారి డా.ఎస్.మన్మధరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 7 పశు వైద్య శాలలు, 38 పశు వైద్య శస్త్ర చికిత్సాలయాలు, 35 గ్రామీణ పశు వైద్య కేంద్రాల ద్వారా పశు వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News March 27, 2025
కొడంగల్: భూమి పూజ చేసిన సీఎం సోదరుడు

కొడంగల్ పరిధి మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని రెనివట్ల గ్రామంలో గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి భూమి పూజా కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్తో పాటు, కడా ఛైర్మన్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News March 27, 2025
ఫొగట్కు 3 ఛాయిస్లిచ్చిన హరియాణా ప్రభుత్వం!

భారత మాజీ రెజ్లర్, కాంగ్రెస్ MLA వినేశ్ ఫొగట్కు క్రీడా విధానం కింద ఇచ్చే ప్రయోజనాలను హరియాణా ప్రభుత్వం వెల్లడించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆమె ఎమ్మెల్యే కావడంతో 3 ఛాయిస్లు ఇస్తున్నట్లు పేర్కొంది. రూ.4కోట్ల నగదు, హరియాణా షహ్రీ వికాస్ ప్రాధికార్ (HSVP) కింద ప్లాట్ లేదా గ్రూప్-A ఉద్యోగంలో ఏదైనా ఒకటి ఇస్తామంది. అయితే ఈ మూడింటిలో ఏది కావాలో చెప్పాలని కోరగా, ఆమె నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.
News March 27, 2025
పెదగంట్యాడలో ఫ్రీ కోచింగ్.. ఎస్సీలు మాత్రమే అర్హులు

ఏపీ ప్రభుత్వం స్థాపించిన నేక్ ఆధ్వర్యంలో ఫ్రంట్ ఆఫీస్ అసోసియేట్ గా ఉపాధి కొరకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు నేక్ అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ గురువారం తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన 18-44 సంవత్సరాలలోపు ఎస్సీ కులాలకు చెందిన యువతకు మాత్రమే 3 నెలల శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ అనంతరం ప్రైవేట్ సెక్టార్లో ఉపాధి కల్పిస్తారన్నారు. పెద్దగంట్యాడలోని నేక్ సెంటర్లో శిక్షణ అందిస్తామని తెలిపారు.