News April 4, 2025
పార్వతీపురం: పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

భార్య మందలించిందని ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పార్వతీపురం జిల్లా గరుగుబిల్లి మండలంలో జరిగింది. వల్లరిగుడబ గ్రామానికి చెందిన పలగర్ర పోలి (40)ని మందు తాగొద్దని భార్య మందలించడంతో మనస్తాపం చెంది పురుగు మందు తాగాడు. వెంటనే ఆటోలో పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు పార్వతీపురం అవుట్ పోస్ట్ ASI భాస్కరరావు తెలిపారు.
Similar News
News December 1, 2025
వనపర్తి: రెండో రోజు 204 సర్పంచ్ నామినేషన్లు దాఖలు..!

వనపర్తి జిల్లాలో రెండో విడతలో జరగనున్న 94 గ్రామ పంచాయతీలకు నేడు మొత్తం 204 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. మండలాల వారీగా నామినేషన్లు ఇలా ఉన్నాయి..
✓ ఆత్మకూరు – 33 నామినేషన్లు.
✓ అమరచింత – 33 నామినేషన్లు.
✓ కొత్తకోట – 59 నామినేషన్లు.
✓ మదనాపురం – 28 నామినేషన్లు.
✓ వనపర్తి – 51 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఇప్పటివరకు 299 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.
News December 1, 2025
రాజీనామాను ఉపసంహరించుకున్న MLC జకియా ఖానం

తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు మండలి డిప్యూటీ స్పీకర్ జకియా ఖానం మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు తెలిపారు. ఎమ్మెల్సీల రాజీనామాలపై మండలి ఛైర్మన్ మోషేన్ రాజు సోమవారం విచారణ జరిపారు. 6 నెలల్లో తన పదవి కాలం పూర్తవుతుందని, ఇప్పుడు రాజీనామా చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదని ఛైర్మన్ సూచించడంతో ఆమె తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. YCP తరఫున MLC గా ఎన్నికైన ఆమె పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
News December 1, 2025
అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

➤ గంజాయి కేసులో నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్ష
➤ PGRS లో ఫిర్యాదులు వెల్లువ
➤ పింఛన్లు పంపిణీలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు
➤ గృహ,ఇంటి స్థలం దరఖాస్తుకు గడువు పెరిగింది: బత్తుల తాతయ్యబాబు
➤ ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీలు
➤ రాజాంలో ఎనిమిది మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
➤ జాతీయస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ముగ్గురు విద్యార్థులు ఎంపిక
➤డి.యర్రవరంలో బాలికల వసతి గృహాన్ని ప్రారంభించిన స్పీకర్


