News July 21, 2024

పార్వతీపురం: ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డైరెక్టర్‌గా నిశాంత్ కుమార్

image

స్టేట్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డైరెక్టర్‌గా నిశాంత్ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. జిల్లాలో 2024 సాధారణ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేశారు. జిల్లా ఏర్పడిన తర్వాత అన్ని శాఖల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లారని ఈయనకు పేరుంది.

Similar News

News January 9, 2026

VZM: ‘పీహెచ్‌సీల్లో వైద్య‌సేవ‌లు మెరుగుప‌డాలి’

image

విజయనరం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య‌సేవ‌ల‌ను మెరుగుప‌రిచి ఓపిని పెంచాల‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి ఆయా శాఖాధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీ వైద్య సేవ‌ల‌పై కలెక్టర్ కార్యాల‌యం నుంచి శుకవ్రారం వీడియో కాన్ఫ‌రెన్స్‌తో స‌మీక్షించారు. ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ స‌ర్వేపైనా చ‌ర్చించారు. పీహెచ్‌సీల వైద్య‌సేవ‌ల‌పై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఓపిని రోజుకి 50కి పెంచాల‌ని ఆదేశించారు.

News January 8, 2026

నేరాల నియంత్రణకు సాంకేతికతను వినియోగించండి: SP

image

జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నేర సమీక్షను నిర్వహించారు. నేరాల నియంత్రణకు సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని ఎస్పీ దామోదర్‌ అధికారులను ఆదేశించారు. అన్ని కేసుల్లో ఈ-సాక్ష్య యాప్ వినియోగం, సీసీటీఎన్‌ఎస్‌లో వివరాల అప్‌లోడ్ తప్పనిసరి అన్నారు. ఎన్‌బీడబ్ల్యూ అమలు, గంజాయి అక్రమ రవాణా నియంత్రణ, సైబర్ నేరాలపై దృష్టి పెట్టాలన్నారు.

News January 8, 2026

వెట్టిచాకిరీ పూర్తిగా నిర్మూలించాలి: VZM కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో ఎక్కడా.. ఏ రూపంలోనూ వెట్టిచాకిరీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లా స్థాయి వెట్టిచాకిరీ నిఘా, పర్యవేక్షణ కమిటీ తొలి సమావేశం బుధవారం జరిగింది. పిల్లలు, గిరిజనులు, వ్యవసాయ కూలీలతో వెట్టిచాకిరీకి తావులేకుండా నిఘా పెంచాలని ఆయన సూచించారు. వెట్టి నుంచి విముక్తి చేసిన వారికి బ్యాంకులు, DRDA ద్వారా ఆర్థిక సహాయం అందించి జీవనాధారం కల్పించాలన్నారు.