News January 24, 2025

పార్వతీపురం: ఫైలేరియా నియంత్రణ కార్యక్రమం విజయవంతం కావాలి

image

వచ్చే నెల 10 నుంచి 12వ తేదీ వరకు జిల్లాలో జరగనున్న ఫైలేరియా నియంత్రణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. గత ఏడాది నవంబర్ మాసంలో నిర్వహించిన సర్వేలో బలిజిపేట మండలంలో ఫైలేరియా కేసులు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని అన్నారు.

Similar News

News September 16, 2025

తిరుపతి: APR సెట్-24 కన్వీనర్‌గా ఉష

image

రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో వివిధ కోర్సులకు సంబంధించిన పీహెచ్‌డీ ప్రవేశాలకు నిర్వహించనున్న ఏపీఆర్ సెట్ నిర్వహణ బాధ్యతలు శ్రీపద్మావతి మహిళా వర్సిటీ ఆచార్యులకు దక్కాయి. ఆర్‌సెట్ కన్వీనర్‌గా వర్సిటీ బయోటెక్నాలజీ విభాగాధిపతి ఆచార్య ఆర్.ఉష, కోకన్వీనర్‌గా అదే భాగానికి చెందిన ఎన్.జాన్ సుష్మను నియమిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

News September 16, 2025

HYD మెట్రోలో సెక్యూరిటీ గార్డులుగా ట్రాన్స్‌జెండర్లు

image

TG: హైదరాబాద్‌లోని మెట్రో రైళ్లలో ట్రాన్స్‌జెండర్లను సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 20 మంది హిజ్రాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అపాయింట్‌మెంట్ లెటర్స్ అందజేశారు. గార్డుల నియామకాల కోసం 400 మంది దరఖాస్తు చేసుకోగా నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేసినట్లు వివరించారు. ట్రాన్స్‌జెండర్లు సమాజంలో గౌరవంగా బతకాలనే ఉద్దేశంతోనే ఈ అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు.

News September 16, 2025

సంగారెడ్డి: రేపు కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం

image

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఉదయం 10 గంటలకు మంత్రి దామోదర రాజనర్సింహ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని చెప్పారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సమయానికి హాజరుకావాలని సూచించారు.