News January 29, 2025

పార్వతీపురం ఫ్లైఓవర్‌పై యువకుడు మృతి

image

బైకు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు బుధవారం మృతి చెందాడు. ఈ ఘటన పార్వతీపురం ఫ్లైఓవర్‌పై చోటుచేసుకుంది. మృతుడు పార్వతీపురంలోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న సంతుగా గుర్తించారు. అతనిది బెలగాం అని ప్రమాదానికి గల కారణాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.

Similar News

News December 7, 2025

జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ముహూర్తం ఫిక్స్

image

TG: ‘ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు’ వేడుకల్లో భాగంగా ఎల్లుండి ఉ.10 గంటలకు జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాలని కలెక్టర్లను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గత ఏడాది డిసెంబర్ 9న సచివాలయంలో విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి జరిగే గ్లోబల్ సమ్మిట్‌‌లోనూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

News December 7, 2025

NLG: అప్పుల్లో మునిగిన తెలంగాణ: కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఆరోపణ

image

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల్లో ముంచిందని, ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి భూములను అమ్ముకునే పరిస్థితి వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నల్గొండలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, రేవంత్ ప్రభుత్వాల అవినీతి పాలనలో ఎలాంటి మార్పు లేదన్నారు. భూముల అమ్మకాలతోనే ప్రభుత్వం నెట్టుకొస్తుందని, గ్యారంటీలు ఏ వర్గానికి ఉపయోగపడలేదని దుయ్యబట్టారు.

News December 7, 2025

HIV బాధితుల పట్ల వివక్ష చూపొద్దు: మంత్రి నిమ్మల

image

2030 నాటికి HIV రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తునట్లు మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో HIV బాధితులకు చేయూత కార్యక్రమంలో ఆదివారం మంత్రి పాల్గొన్నారు. HIV బాధితులకు పౌష్టికాహారం, నిత్యవసర సరుకుల బ్యాగులను మంత్రి పంపిణీ చేసారు. సమాజంలో HIV బాధితుల పట్ల మానవత్వం, ప్రేమానురాగాలతో మెలగాలని, వారి పట్ల వివక్ష చూపవద్దని కోరారు.