News February 11, 2025

పార్వతీపురం: ‘బంద్‌కు సహకరించండి’

image

1/70 చట్టాన్ని సవరించాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా 12వ తేదీన జరగనున్న ఏజెన్సీ బంద్‌కు సహకరించాలని అఖిలపక్ష నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం డిపో మేనేజర్ కనకదుర్గకు వినతిపత్రం అందజేశారు. గిరిజన సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే విధంగా చట్ట సవరణ చేయాలని చూస్తున్నారు ఆరోపించారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News February 8, 2026

GWL: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక పర్యవేక్షణ

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో 77 వార్డులు ఉండగా 189 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు SP శ్రీనివాసరావు తెలిపారు. 105 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి వాటిపై ఎలక్షన్ సెల్ ద్వారా క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేస్తామన్నారు. బందోబస్తు నిర్వహణ మొదలుకొని ఎన్నికల సామగ్రికి భద్రత కల్పించే వరకు ప్రతి అంశాన్ని ప్రణాళికాబద్ధంగా పర్యవేక్షణ చేస్తామన్నారు.

News February 8, 2026

MBNR: రేపటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

image

మహబూబ్‌నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎస్పీ డి.జానకి స్పందిస్తూ.. ప్రచార సమయం ముగిసిన వెంటనే బయటి ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు, కార్యకర్తలు జిల్లా విడిచి వెళ్లాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 8, 2026

NLG: ఓట్ల లెక్కింపునకు వేదిక ఖరారు.. 3 రోజులు సెలవు!

image

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం నిడమనూరులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను కౌంటింగ్ కేంద్రంగా అధికారులు ఎంపిక చేశారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఈ పాఠశాలకు ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు స్థానిక సెలవులను ప్రకటించారు. లెక్కింపు ప్రక్రియకు ఆటంకం కలగకుండా ప్రిన్సిపాల్ తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.