News April 7, 2025
పార్వతీపురం: ‘బిసి యూనిట్ల ఏర్పాటు వేగవంతం చేయాలి’

జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసే స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేయుటకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందని ఆమేరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో ఇంటర్వ్యూలు పూర్తి చేశారని ఆయన చెప్పారు.
Similar News
News December 1, 2025
శ్రీశైలంలో నేటి నుంచి ఉచిత లడ్డూ ప్రసాదం

శ్రీశైలం మల్లికార్జున స్వామి క్షేత్రంలో సోమవారం నుంచి భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పథకం ప్రారంభం కానుంది. అతిశీఘ్ర దర్శనం (రూ.300) టికెట్ కొనుగోలు చేసిన వారికి ఒక లడ్డూను, స్వామివారి స్పర్శ దర్శనం (రూ.500) టికెట్ దారులకు రెండు లడ్డూలను ఉచితంగా అందజేస్తారు. అలాగే, డొనేషన్ కౌంటర్, ఛైర్మన్ ఛాంబర్, కైలాస కంకణాల కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు, శ్రీగోకులం ఆధునికీకరణ పనులకు భూమి పూజ చేయనున్నారు.
News December 1, 2025
నేటి నుంచి ప్రజాపాలన ఉత్సవాలు

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో నేటి నుంచి ఆరు రోజుల పాటు పలు ఉమ్మడి జిల్లాల్లో ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించనుంది. ఇవాళ ఉమ్మడి MBNRలోని మక్తల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. CM రేవంత్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. మరోవైపు రాష్ట్రాభివృద్ధి, భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
News December 1, 2025
బాలానగర్కు ఆ పేరెలా వచ్చిందంటే..!

బాలానగర్ మండల కేంద్రం పూర్వం నాయన పల్లి ప్రసిద్ధి చెందింది. రాజా బాలచంద్ ఈ ప్రాంత వాతావరణంకి ముగ్ధుడై కొన్ని సంవత్సరాలపాటు పరిపాలించాడు. ఆయన పేరు మీదుగా బాలానగర్ అనే పేరు మారింది. ఇప్పటికీ శిథిలమైన విశ్రాంతి గృహం ఉంది. 300 ఏళ్ల పూర్వం ఈ ప్రాంతాన్ని కడపటి రెడ్డి రాజులు పరిపాలించారు. దీంతో చుట్టుపక్కల రంగారెడ్డి గూడ, కేతిరెడ్డిపల్లి, ముదిరెడ్డిపల్లి పేరుతో గ్రామాలు ఇప్పటికి కొనసాగుతున్నాయి.


