News April 3, 2025
పార్వతీపురం: బీసీ కార్పొరేషన్ రుణాలకు రేపు బ్యాంకర్ల ఇంటర్వ్యూలు

బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తుదారులకు ఈ నెల 4న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. పార్వతీపురంలోని మెప్మా కార్యాలయంలో పలు బ్యాంకుల అధికారులు పాల్గొని ఇంటర్వ్యూలు చేస్తారని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 15 సచివాలయాల నుంచి 968 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
Similar News
News April 14, 2025
HYD: ఇంజినీరింగ్ కాలేజీల్లో రైడ్స్.. టెన్షన్!

సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలల నిర్వాహకుల్లో టెన్షన్ నెలకొంది. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 2 వరకు JNTUH నిజ నిర్ధారణ కమిటీ (FFC) తనిఖీలు నిర్వహించనుంది. ఆయా కళాశాలల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. 120 మంది ప్రొఫెసర్లతో తనిఖీల కోసం 25 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసింది. JNTUH పరిధిలో 137 ఇంజినీరింగ్, 72 ఫార్మసీ, 6 ఎంబీఏ కాలేజీలు ఉన్నాయి. నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
News April 14, 2025
సిద్దిపేట: పిల్లలపై నిరంతరం అప్రమత్తంగా ఉండండి

మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో సెలవుల్లో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికీ అప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
News April 14, 2025
కోటపల్లి: నవదంపతుల సూసైడ్

పెళ్లైన 6 నెలలకే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కోటపల్లి (M) దేవులవాడకు చెందిన సృజన(30) లక్షెట్టిపేటలో డిగ్రీ చదువుతోంది. కులాలు వేరే కావడంతో పెద్దలను ఎదురించి సీనియర్ విష్ణువర్ధన్ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలో విష్ణువర్ధన్ మార్చి 24న గోదావరిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన సృజన ఇంట్లోనే ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుబుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.