News February 9, 2025
పార్వతీపురం: మద్యం షాపుల లాటరీ వాయిదా

సోమవారం నిర్వహించనున్న మద్యం షాపుల లాటరీ విధానాన్ని వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 27న జరుగనున్న కారణంగా ఎలక్షన్ కోడ్ నిబంధన మేరకు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆదేశాలతో వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 28, 2025
WARNING: నేడు రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు

AP: నేడు రాష్ట్రవ్యాప్తంగా వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు మధ్యాహ్న సమయాల్లో బయటికి వెళ్లొద్దని హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లాలో 14 మండలాలు, విజయనగరం-22, పార్వతీపురం మన్యం-12, అల్లూరి సీతారామరాజు-12, అనకాపల్లి-9, కాకినాడ-7, తూర్పుగోదావరి-8, ఏలూరు జిల్లా-5, ఎన్టీఆర్ జిల్లాలో 3 మండలాల్లో తీవ్రవడగాలులు వీచే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.
News March 28, 2025
VJA: యువకుడిపై దాడి.. డబ్బుతో పరార్

ఓ ఆటోలో ఇద్దరు వ్యక్తులు కలిసి విజయవాడ బస్టాండ్ వద్దకు వచ్చి ఓ యువకుడితో అమ్మాయి ఉందని రేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ మేరకు ఉండవల్లి సమీపంలో పొలాల వద్దకు వచ్చారు. అక్కడ యువకుడి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారు. పని అయ్యాక విజయవాడలో వదిలిపెట్టాలని కోరాడు. దీంతో ఆటోకి రూ.1500ఇవ్వాలని యువకుడిపై దాడి చేసి, జేబులోని డబ్బు లాక్కెళ్లారు. యువకుడు ఫిర్యాదుకు వెళ్తే పోలీసులు మందలించి పంపారు.
News March 28, 2025
MBNR: రాజీవ్ యువ వికాసం.. APPLY చేసుకోండి..!

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అర్హులైన బీసీ నిరుద్యోగ యువత “రాజీవ్ యువ వికాసం పథకం”ను ఆన్లైన్లో ఏప్రిల్ 5లోగా దరఖాస్తులు చేసుకోవాలని బీసీ అభివృద్ధి శాఖ అధికారిణి ఇందిర ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా యువత ఉపాధి రుణాలు పొందవచ్చని, ఎంపికైన అభ్యర్థులకు జూన్ 2న ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తోందన్నారు. ఆసక్తిగల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. SHARE IT