News January 27, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో 3 రిజర్వ్ కేటగిరి మద్యం షాపులు

పార్వతీపురం మన్యం జిల్లాలో 3 రిజర్వ్ కేటగిరి మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు ఈఎస్ శ్రీనాధుడు ప్రకటలో తెలిపారు. సాలూరు రూరల్, పార్వతీపురం టౌన్, వీరఘట్టంలో ఏ-4 షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. అప్లికేషన్ ఫీజు రూ. 2 లక్షలు, లైసెన్స్ ఫీజు రూ. 21.66 లక్షలు ఉందన్నారు. షాపులు లాటరీ విధానంలో కేటాయిస్తున్నట్లు తెలిపారు. వచ్చేనెల 5లోగా అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News July 6, 2025
వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా రామాంజి నేయులు

వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా గుంతకల్లుకు చెందిన జింకల రామాంజనేయులు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ సీఎం జగన్, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరామి రెడ్డికి రామాంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికలలో వైసీపీ గెలుపు కోసం కృషి చేయాలని వెంకటరామిరెడ్డి ఆయనకు సూచించారు.
News July 6, 2025
TU: జులై 15 వరకు గడువు ఇవ్వాలి: TUSC JAC

టీయూ రెండో స్నాతకోత్సవంలో పీజీ, Ph.D పట్టాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవడానికి మరికొన్ని రోజులు గడువు ఇవ్వాలని TUSC JAC పూర్వ అధ్యక్షుడు సత్యం కోరారు. 12 ఏళ్ల తర్వాత రెండో స్నాతకోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా పీజీ, Ph.D పట్టాలు పొందేందుకు విద్యార్థులకు కేవలం మూడు రోజుల సమయం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి జులై 15వరకు గడువు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
News July 6, 2025
ఫార్మాసూటికల్స్లో అపార అవకాశాలు: మోదీ

అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేతో అద్భుతమైన సమావేశం జరిగినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘అర్జెంటీనాతో 75 ఏళ్ల ద్వైపాక్షిక సంబంధాలు, అందులోనూ 5 ఏళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. రానున్నకాలం ఇరు దేశాల మధ్య మరింత ఆశాజనకంగా ఉంటుంది. వ్యవసాయం, రక్షణ, భద్రత, ఇంధన రంగాల్లో సహకారం గురించి చర్చించాం. ఫార్మాస్యూటికల్స్, క్రీడల వంటి రంగాల్లోనూ అపారమైన అవకాశాలు ఉన్నాయి’ అని తెలిపారు.