News February 9, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో 60 దరఖాస్తులు

పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా కల్లు గీత కార్మికులకు కేటాయించిన రిజర్వుడ్ మద్యం షాపులకు 60 దరఖాస్తులు వచ్చినట్లు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు తెలిపారు. మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు శనివారంతో గడువు ముగిసిందని పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీ ఉదయం 9 గంటలకు పార్వతీపురం కలెక్టరేట్లో లాటరీ ద్వారా షాపులు కేటాయించనున్నట్లు వెల్లడించారు.
Similar News
News December 3, 2025
యాదాద్రి: రాజ్యాంగ నిర్మాత ఆశీస్సులతో నామినేషన్

రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా BSP మండలాధ్యక్షుడు నకిరేకంటి నరేశ్ మంగళవారం రాత్రి నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యాంగ నిర్మాత డా.BR.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆశీస్సులు తీసుకుని నామినేషన్ కేంద్రం వరకు ర్యాలీగా వెళ్లారు. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. నియోజకవర్గ అధ్యక్షుడు గూని రాజు, పావురాల నరసింహ యాదవ్, మారయ్య, రాజు ఉన్నారు.
News December 3, 2025
సిరిసిల్ల: రెండో దశ.. పంచాయతీలకు 603 నామినేషన్లు

జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల కోసం 603 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 88 పంచాయతీలకు గాను చివరిరోజు మంగళవారం 292 నామినేషన్లు స్వీకరించగా మొత్తం నామినేషన్ల సంఖ్య 603కు చేరిందని అధికారులు తెలిపారు. 758 వార్డులకు గాను మంగళవారం 1,119 నామినేషన్లు రాగా మొత్తం 1,811 నామినేషన్లు అందినట్లు వివరించారు. నేడు నామినేషన్ల పరిశీలన ప్రక్రియను నిర్వహించనున్నారు.
News December 3, 2025
శ్రీకాకుళం: కొండెక్కిన టమాటాల ధర

శ్రీకాకుళం మార్కెట్లో టమాటా ధరలు చుక్కలు తాకుతున్నాయి. ప్రస్తుతం కిలో 70 రూపాయలు పలుకుతోంది అక్టోబర్, నవంబర్ నెలలలో కిలో టమాటాల ధర సగటున రూ.30 నుంచి రూ.50కు పెరిగినట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఈ నెలలో ఇప్పటికీ 70 రూపాయలుగా ఉందని, ఇది ₹100 దాటవచ్చని అంటున్నారు. అధిక వర్షపాతంతో దిగుబడి తగ్గడంతోపాటు అయ్యప్ప దీక్షల కారణంగా టమాటాకు డిమాండ్ పెరిగిందంటున్నారు. మీ ఏరియాలో ధర ఎంతో కామెంట్ చేయండి.


