News February 9, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో 60 దరఖాస్తులు

image

పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా కల్లు గీత కార్మికులకు కేటాయించిన రిజర్వుడ్ మద్యం షాపులకు 60 దరఖాస్తులు వచ్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు తెలిపారు. మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు శనివారంతో గడువు ముగిసిందని పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీ ఉదయం 9 గంటలకు పార్వతీపురం కలెక్టరేట్‌లో లాటరీ ద్వారా షాపులు కేటాయించనున్నట్లు వెల్లడించారు.

Similar News

News November 26, 2025

ఎవరితోనైనా కలసి పనిచేసేందుకు సిద్ధం: శ్రీకాంత్ రెడ్డి

image

రాయచోటి ప్రాంతానికి ఎటువంటి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇందుకోసం ఎవరితోనైనా కలసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని YCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాయచోటిని మంచి పట్టణంగా తీర్చిదిద్దాలని యూనివర్సిటీ ఏర్పాటుకు 100 ఎకరాలు సేకరించామని, యువత కోసం ఏపీఐఐసీకి శిబ్యాల దగ్గర 500 ఎకరాల భూముల సేకరణతో సహా ఎన్నో పనులు చేశామన్నారు.

News November 26, 2025

iBOMMA రవి కేసులో ట్విస్ట్.. పైరసీ చేయకుండా..!

image

iBOMMA రవి నేరుగా సినిమాలు పైరసీ చేయలేదని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. టెలిగ్రామ్, మూవీరూల్జ్, తమిళ్‌ఎంవీ లాంటి పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసేవాడని తెలిపారు. క్వాలిటీ తక్కువగా ఉన్న ఆ సినిమాలను టెక్నాలజీ సాయంతో HD క్వాలిటీలోకి మార్చి ఐబొమ్మ, బప్పం సైట్లలో పోస్ట్ చేసేవాడని చెప్పారు. అయితే గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ రూ.20 కోట్ల వరకు సంపాదించినట్లు గుర్తించారు.

News November 26, 2025

హార్టికల్చర్ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన పురందీశ్వరి

image

రాజమండ్రి ఎంపీ డాక్టర్ దగ్గుబాటి పురందీశ్వరి బుధవారం రాజమండ్రి రూరల్ వేమగిరిలోని హార్టికల్చర్ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న పరిశోధనలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నర్సరీ రైతు ఈ పరిశోధనా కేంద్రం ద్వారా ఉపయోగం పొందాలని ఆమె అన్నారు. ప్రతి నర్సరీ రైతు విధిగా తమ పేరును హార్టికల్చర్ ఏడీ ఆఫీసులో నమోదు చేసుకోవాలని సూచించారు.