News February 25, 2025
పార్వతీపురం మన్యం జిల్లాల్లో మహాశివరాత్రి శోభ

పార్వతీపురం మన్యం జిల్లాల్లో మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు ముస్తాబయ్యాయి. జిల్లాలో కొమరాడ మండలంలో గుంప సోమేశ్వర ఆలయం, సాలూరు సమీపంలో పారమ్మకొండ, పార్వతీపురం సమీపంలో గల అడ్డాపుశీల, మక్కువ సమీపంలో గలగల ఉమా శాంతేశ్వర ఆలయం, ములక్కాయవలస ఆలయాలతో పాటు పలు ఆలయాలు ఉన్నాయి. మరి మీ ప్రాంతంలో ఉన్న శివాలయాలను కామెంట్ చేయండి.
Similar News
News December 26, 2025
అన్నవరంలో ఆగని అపచారాలు!

అన్నవరం సత్యదేవుని ఆలయ సిబ్బంది వ్యవహారశైలిపై భక్తులు మండిపడుతున్నారు. కేశఖండశాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ క్షురకుడిని ఈవో త్రినాథరావు సస్పెండ్ చేశారు. గురువారం రాత్రి వసతి గదుల కోసం సీఆర్వో కార్యాలయానికి వెళ్లిన వారి పట్ల ఓ ఉద్యోగి దురుసుగా ప్రవర్తించినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు మారినా సిబ్బంది తీరు మారడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News December 26, 2025
సంక్రాంతికి రైతుభరోసా..!

TG: యాసంగి సీజన్ రైతు భరోసా డబ్బులను (ఏడాదికి ఎకరానికి రూ.12,000) సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శాటిలైట్ ఇమేజెస్ ద్వారా రైతులు, పంట డేటా సిద్ధం చేస్తోంది. జనవరి రెండో వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనుంది. పంటలు సాగు చేయని భూములను రైతు భరోసా నుంచి మినహాయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
News December 26, 2025
ప.గో: ఆడుకోమని వదిలిన తండ్రి.. విగత జీవిగా కొడుకు!

పార్కులో తన కొడుకుని ఆడుకోమని వదిలి వెళ్లిన కొద్దిసేపటికి చెరువులో పడి విగత జీవిగా మారిన ఘటన గురువారం పెనుగొండలో చోటుచేసుకుంది. ఇరగవరం మండలం ఆర్.కండ్రిక గ్రామానికి చెందిన జొన్నల ధనరాజు పెనుగొండలో బేకరీ నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం కుమారుడు ఈశ్వర్(5) తీసుకొని బేకరీకి వచ్చిన ధనరాజు కొద్దిసేపు పార్కులో ఆడుకోమని వదిలిపెట్టి వెళ్లాడు. బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు.


