News March 9, 2025
పార్వతీపురం మన్యం జిల్లాకు 35 మంది ఎస్ఐలు

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డిని నూతన ప్రొబేషనరీ ఎస్ఐలు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల అనంతపురం ట్రెయినింగ్ కళాశాలలో శిక్షణ ముగించుకుని ప్రాక్టికల్ శిక్షణ నిమిత్తం కేటాయించిన 35 మంది జిల్లాకు వచ్చారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తూ, పోలీస్ శాఖ ప్రతిష్ఠను మరింత పెంచేలా విధులను నిర్వర్తించాలని ఎస్పీ తెలిపారు. 35 మందికి వివిధ పోలీస్ స్టేషన్లను కేటాయించారు.
Similar News
News March 10, 2025
WNP: చేపలవేటకు వెళ్లిన వ్యక్తి మృతి

మదనాపురం మండలంలో చేపలవేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. రామన్పాడుకు చెందిన గిరన్న (55) రోజు మాదిరిగానే తెల్లవారుజామున గ్రామ సమీపంలోని జలాశయంలో చేపలవేటకు వెళ్లాడు. ఎంతకూ ఇంటికి తిరిగిరాకపోవటంతో కుటుంబసభ్యులు జలాయశయంలో గాలించటంతో అతడి మృతదేహం లభ్యమైంది. రెండు కాళ్లకు వల చుట్టుకోవటంతో నీటి మునిగి మృతి చెందినట్లు తెలిపారు.
News March 10, 2025
TDP సీనియర్లకు నిరాశ.. ముందుగానే ఫోన్లు

AP: MLA కోటా MLC సీటు ఆశించిన పలువురు TDP సీనియర్లకు నిరాశ ఎదురైంది. అయితే అభ్యర్థులను ప్రకటించక ముందే వారికి రాష్ట్ర TDP అధ్యక్షుడు పల్లా నుంచి ఫోన్లు వెళ్లాయి. ఏ కారణం వల్ల పరిగణనలోకి తీసుకోవట్లేదో వివరించి, భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామని CM మాటగా వివరించారు. దేవినేని ఉమ, పిఠాపురం వర్మ, KS జవహర్, మాల్యాద్రి, వంగవీటి రాధా, టీడీ జనార్దన్, దువ్వారపు రామారావు, అశోక్ బాబు తదితరులకు నచ్చజెప్పారు.
News March 10, 2025
ప్రకాశం జిల్లాలో సూపర్ ఫొటో..❤

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామంలో కొండలను చీల్చుకుంటూ సూర్యుడు ఇలా బయటకు వచ్చాడు. ఇదే సమయంలో కొండలను తాకేలా మేఘాలు రావడంతో చూపరులను కనువిందు చేసింది. అటుగా వెళ్లిన వాళ్లు ఈ దృశ్యాన్ని క్లిక్ మనిపించారు.