News March 9, 2025
పార్వతీపురం మన్యం జిల్లాకు 35 మంది ఎస్ఐలు

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డిని నూతన ప్రొబేషనరీ ఎస్ఐలు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల అనంతపురం ట్రెయినింగ్ కళాశాలలో శిక్షణ ముగించుకుని ప్రాక్టికల్ శిక్షణ నిమిత్తం కేటాయించిన 35 మంది జిల్లాకు వచ్చారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తూ, పోలీస్ శాఖ ప్రతిష్ఠను మరింత పెంచేలా విధులను నిర్వర్తించాలని ఎస్పీ తెలిపారు. 35 మందికి వివిధ పోలీస్ స్టేషన్లను కేటాయించారు.
Similar News
News February 17, 2026
ధరలు పెరిగినా.. బంగారం దిగుమతులు తగ్గేదేలే!

భారత్లో ఈ ఏడాది జనవరిలో బంగారం దిగుమతులు ఒక్కసారిగా ఎగబాకాయి. స్విట్జర్లాండ్, UAE నుంచి భారీగా తరలిరావడంతో మొత్తం గోల్డ్ ఇంపోర్ట్స్ $12.1 బిలియన్లకు చేరాయి. దీంతో దేశ వాణిజ్య లోటు 3నెలల గరిష్ఠానికి ($34.7 బిలియన్లు) చేరింది. క్వాంటిటీ పరంగా దిగుమతులు తగ్గుతున్నా ధరలు ఆకాశాన్ని తాకడం వల్లే విలువల పరంగా ఈ పెరుగుదల కనిపిస్తోందని, ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ ఎగబాకడమూ ఓ కారణమని వాణిజ్య శాఖ వివరించింది.
News February 17, 2026
BREAKING: బాన్సువాడ: కారులో రూ.8 లక్షలు చోరీ

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మాధవరావు అనే రైతు స్థానిక ఎస్బీఐ బ్యాంకు నుంచి మంగళవారం మధ్యాహ్నం రూ.8 లక్షలు డ్రా చేశారు. అనంతరం పట్టణంలోని రిలయన్స్ సూపర్ మార్కెట్లో సరకులు తీసుకోవడానికి కారును పార్కు చేశారు. వచ్చేలోపు గుర్తుతెలియని దుండగులు కారు అద్దాలు పగలగొట్టి లోపల ఉన్న నగదును దోచుకెళ్లారు. ఈ విషయమై బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి సీసీ ఫుటేజీలను పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు.
News February 17, 2026
మానవత్వం చాటుకున్న మంత్రి సత్యకుమార్

రోడ్డు ప్రమాద క్షతగాత్రులను చూసిన వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి మంత్రి సత్యకుమార్ యాదవ్ మానవత్వం చాటుకున్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మంగళగిరిలో జరిగే మరో కార్యక్రమానికి వెళ్తుండగా ఎయిమ్స్ సమీపంలో బైకులు ఢీకొని ఓ యువతి, వ్యక్తి గాయపడటాన్ని గమనించారు. మంత్రి వెంటనే తన వాహనం నుంచి దిగి క్షతగాత్రులకు సపర్యలు చేసి పరామర్శించారు. అనంతరం అంబులెన్సులో ఎయిమ్స్కి పంపించారు.


