News March 11, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ మండలాల వారు జాగ్రత్త

పార్వతీపురం మన్యంలో నేడు ఈ మండలాల్లో వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) అధికారిక X ఖాతా ద్వారా సోమవారం హెచ్చరికలు జారీ చేసింది. వడగాలుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
*బలిజిపేట-40.1
*భామిని-39.2
*గరుగుబిల్లి-39.8
*గుమ్మలక్ష్మీపురం-38.6
*జియ్యమ్మవలస-39.7
ఈ మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.
Similar News
News March 7, 2026
WGL: రంజాన్.. మసీదులకు లైటింగ్ ఏర్పాటు

రంజాన్ పర్వదినం సందర్భంగా మసీదులకు లైటింగ్ ఏర్పాట్లు చేయాలని నగర మేయర్ సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం GWMC సర్కిల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారుల సమావేశంలో మేయర్ పాల్గొని ముస్లింలకు ఇబ్బందులు కలగకుండా బల్దియా ఆధ్వర్యంలో లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. డివిజన్లలో దెబ్బతిన్న లైట్లను పునరుద్ధరించడంతో పాటు ఎన్పీడీసీఎల్ వారి సమన్వయంతో వీధి దీపాలు లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు.
News March 7, 2026
31లోగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం: పొంగులేటి

ఖమ్మం: ఈనెల 31వ తేదీలోగా రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. మంజూరైన ప్రతి ఇళ్లు వెంటనే గ్రౌండింగ్ కావాలని, పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఏప్రిల్లో రెండో విడత ఇళ్లు మంజూరు చేస్తామని, ఈలోగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
News March 7, 2026
మహబూబాబాద్: పదో తరగతిలో 100% ఫలితాలే లక్ష్యం: కలెక్టర్

పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శనివారం సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో విద్యార్థులకు కామన్ డైట్ మెనూను అమలు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు, ర్యాగింగ్ జరగకుండా చూడాలన్నారు.


