News March 24, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో 381.4 MM వర్షపాతం నమోదు

పార్వతీపురం మన్యం జిల్లాలో గడచిన 24 గంటల్లో 381.4 శాతం వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా పాలకొండ మండలంలో 67.8, వీరఘట్ట మండలంలో 55.4, పార్వతీపురం మండలంలో 49.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. అత్యల్పంగా సాలూరు మండలంలో 2.8 పాచిపెంట మండలంలో 3.2 MM వర్షపాతం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 25.4 శాతం వర్షపాతం పడింది.
Similar News
News October 9, 2025
రేపటినుంచి చార్మినార్ సర్కిల్ అటవీ శాఖ క్రీడా పోటీలు

అటవీ శాఖ చార్మినార్ సర్కిల్ ప్రాంతీయ క్రీడా పోటీలు ఈ నెల 10, 11 తేదీల్లో దూలపల్లిలోని తెలంగాణ అటవీ అకాడమీలో జరుగనున్నాయి. పరుగు పందెం, నడకపోటీ, వెయిట్ లిఫ్టింగ్, షటిల్, క్యారమ్స్, చెస్, లాన్టెన్నీస్, టేబుల్ టెన్నీస్, రైఫిల్ షూటింగ్, అర్చరీ, వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ, హాకీ, టగ్ ఆఫ్ వార్, సైక్లింగ్, మారథాన్ తదితర పోటీలు నిర్వహించనున్నారు.
News October 9, 2025
శ్రీ సత్యసాయి జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా మౌర్య భరద్వాజ్

శ్రీ సత్యసాయి జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా మంత్రి మౌర్య భరద్వాజ్ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈయన గతంలో కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్గా ఉన్న అభిషేక్ కుమార్ బదిలీ అవ్వడంతో మౌర్య భరద్వాజ్ను ప్రభుత్వం నియమించింది. త్వరలోనే మౌర్య బాధ్యతలు చేపట్టనున్నట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు.
News October 9, 2025
NTR: ‘VRAల సమస్యలు తక్షణమే పరిష్కరించండి’

VRAల సమస్యల పరిష్కారానికి జిల్లా సహాధ్యక్షుడు మధుబాబు, ట్రెజరర్ పరదేశీ గురువారం కలెక్టర్ లక్ష్మీశాకు వినతిపత్రం అందజేశారు. అర్హులైన VRAలకు సీనియారిటీ జాబితా ప్రకటించి అటెండర్, వాచ్మెన్, డ్రైవర్లు, రికార్డు అసిస్టెంట్ ప్రమోషన్లు కల్పించాలని కోరారు. రూ.10,500 జీతంతో కుటుంబ పోషణ భారంగా ఉండటం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సహకారం అందిస్తున్నామని తెలిపారు.