News March 24, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో 381.4 MM వర్షపాతం నమోదు

image

పార్వతీపురం మన్యం జిల్లాలో గడచిన 24 గంటల్లో 381.4 శాతం వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా పాలకొండ మండలంలో 67.8, వీరఘట్ట మండలంలో 55.4, పార్వతీపురం మండలంలో 49.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. అత్యల్పంగా సాలూరు మండలంలో 2.8 పాచిపెంట మండలంలో 3.2 MM వర్షపాతం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 25.4 శాతం వర్షపాతం పడింది.

Similar News

News October 8, 2025

ధరూర్: ‘బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలి’

image

బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని గద్వాల జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ పేర్కొన్నారు. బుధవారం ధరూర్ మండలంలో పర్యటించి బడి మానేసి పొలాల్లో పని చేస్తున్న వారిని గుర్తించే చర్యలు చేపట్టారు. పాతపాలెంలో పొలాల్లో పనిచేస్తున్న ఓ విద్యార్థిని గుర్తించి బడిలో చేర్చారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, మెరుగైన విద్య ఇవ్వాలని టీచర్లకు సూచించారు. చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

News October 8, 2025

GWL: ‘పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం’

image

ప్రమాద బాధిత పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటామని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్స్ శ్రావణి మృతి చెందారు. దీంతో ఆమెకు చీప్ ఆఫీస్ వెల్ఫేర్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ నుంచి రూ. 5 లక్షలు బీమా మంజూరైంది. ఆ చెక్కును శ్రావణి తల్లిదండ్రులు ఇందిరమ్మ, ఈశ్వరయ్యకు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అందజేశారు.

News October 8, 2025

ప్రజల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

రాబోయే మూడు గంటల్లో ఏలూరు జిల్లాలో 50 నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి స్పష్టం చేశారు. ఉరుములు, మెరుపుల సమయంలో బహిరంగ ప్రదేశాలకు, పొలాలకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు.