News March 24, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో 381.4 MM వర్షపాతం నమోదు

పార్వతీపురం మన్యం జిల్లాలో గడచిన 24 గంటల్లో 381.4 శాతం వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా పాలకొండ మండలంలో 67.8, వీరఘట్ట మండలంలో 55.4, పార్వతీపురం మండలంలో 49.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. అత్యల్పంగా సాలూరు మండలంలో 2.8 పాచిపెంట మండలంలో 3.2 MM వర్షపాతం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 25.4 శాతం వర్షపాతం పడింది.
Similar News
News October 12, 2025
వృద్ధురాలి దోపిడీ ఘటనలో మనవడే సూత్రధారి: ఏసీపీ

అగనంపూడిలో వృద్ధురాలిని కత్తితో బెదిరించి దోపిడీ చేసిన ఘటనలో మనవడే సూత్రధారి అని ఏసీపీ నర్సింహమూర్తి పోలీసులు తెలిపారు. సురేశ్ తన స్నేహితుడు సుమంత్తో కలిసి అన్నెమ్మను బెదిరించి 5తులాల బంగారు గాజులు దోచుకుపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో సుమంత్ను అదుపులోకి తీసుకొని విచారించగా సురేశ్ సహకారంతోనే దోపిడీకి పాల్పడినట్లు చెప్పాడు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని సీఐ వివరించారు.
News October 12, 2025
ప్రత్తిపాడు: ఎక్కడ చదివిందో.. అక్కడే టీచర్గా..!

ప్రత్తిపాడు మండలం చింతలూరు గ్రామానికి చెందిన పండ్రాడ అపర్ణ ఇటీవల జరిగిన ఏపీ డీఎస్సీ పరీక్షలో స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 69వ ర్యాంక్ సాధించారు. తాను చదువుకున్న చింతలూరు ప్రభుత్వ పాఠశాలలోనే పోస్టింగ్ దక్కింది. తాను చదువుకున్న పాత క్లాస్రూమ్లోనే ఇప్పుడు టీచర్గా విధులు నిర్వహించనుంది. దీంతో అపర్ణకు ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందనలు తెలుపుతున్నారు. ఆమె విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
News October 12, 2025
మెదక్: నేడు కాంగ్రెస్ సమావేశానికి ఉత్తరాఖండ్ మహిళా అధ్యక్షురాలు రాక

ఉత్తరాఖండ్ మహిళా అధ్యక్షురాలు, ఏఐసీసీ అబ్జర్వర్ జ్యోతి రౌతేలా ఈనెల 12న మెదక్ వినాయక ఫంక్షన్ హాల్లో జరిగే కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశానికి హాజరుకానున్నారు. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో స్టేట్ అబ్జర్వర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, వైస్ ప్రెసిడెంట్ సంగిశెట్టి జగదీశ్ పాల్గొననున్నారు.