News March 24, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో 381.4 MM వర్షపాతం నమోదు

image

పార్వతీపురం మన్యం జిల్లాలో గడచిన 24 గంటల్లో 381.4 శాతం వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా పాలకొండ మండలంలో 67.8, వీరఘట్ట మండలంలో 55.4, పార్వతీపురం మండలంలో 49.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. అత్యల్పంగా సాలూరు మండలంలో 2.8 పాచిపెంట మండలంలో 3.2 MM వర్షపాతం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 25.4 శాతం వర్షపాతం పడింది.

Similar News

News October 14, 2025

TDP జిల్లా అధ్యక్ష పదవి ఏ సామాజిక వర్గానికి దక్కేనో..!

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా ఉన్న రెడ్డి అనంత కుమారి ఇటీవల బీసీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్‌గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లాకు కొత్త సారథిని ఎంపిక చేయాలని టీడీపీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. సామాజిక వర్గాల సమీకరణాల దృష్ట్యా, బీసీలకు కాకుండా వేరొక సామాజిక వర్గానికి ఈ కీలక పదవిని కేటాయించే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

News October 14, 2025

రాజోలు: అన్న, చెల్లెలి మధ్య పోరు ఖాయమేనా..?

image

రాజోలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె అమూల్యను టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా నియమించడం చర్చనీయాంశమైంది. గొల్లపల్లి అభిమానులను టీడీపీ వైపు తిప్పుకునేందుకు ఈ నియామకం చేపట్టినట్లు వైసీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. మరోవైపు తనయుడు శ్రీధర్‌కు కోఆర్డినేటర్‌ ఇవ్వాలని గొల్లపల్లి జగన్‌ను కోరడంతో.. రాజోలు బరిలో అన్న, చెల్లెలి మధ్య పోరు ఖాయంగా కనిపిస్తోంది.

News October 14, 2025

వైకుంఠ గంగే స్వామివారి పుష్కరిణి

image

తిరుమల కొండతో పాటు, స్వామి పుష్కరిణిని కూడా గరుత్మంతుడు వైకుంఠం నుంచి భూమిపైకి తెచ్చాడు. ఇది శ్రీదేవి, భూదేవిలకు ప్రియమైనది. దీన్ని సర్వతీర్థాలకు జన్మస్థానంగానూ భావిస్తారు. విరజా నదిలా సకల పాపాలను పోగొట్టే శక్తి దీనికి ఉంటుంది. ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే ఐహిక ఫలాలన్నీ లభిస్తాయి. ఈ పుష్కరిణిని దర్శించడం, స్మరించడం, సేవించడం వలన సమస్త శుభాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. <<-se>>#VINAROBHAGYAMU<<>>