News March 24, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో 381.4 MM వర్షపాతం నమోదు

image

పార్వతీపురం మన్యం జిల్లాలో గడచిన 24 గంటల్లో 381.4 శాతం వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా పాలకొండ మండలంలో 67.8, వీరఘట్ట మండలంలో 55.4, పార్వతీపురం మండలంలో 49.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. అత్యల్పంగా సాలూరు మండలంలో 2.8 పాచిపెంట మండలంలో 3.2 MM వర్షపాతం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 25.4 శాతం వర్షపాతం పడింది.

Similar News

News October 10, 2025

NGKL: మద్యం దుకాణాలకు 51 దరఖాస్తులు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో మద్యం దుకాణాలకు ఇప్పటివరకు 51 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. జిల్లాలో మొత్తం 67 దుకాణాలకు గాను ఇప్పటివరకు 51 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. నాగర్ కర్నూల్ పరిధిలో 30, తెలకపల్లి పరిధిలో 6, కొల్లాపూర్ పరిధిలో 2, కల్వకుర్తి పరిధిలో 13 దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 18 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

News October 10, 2025

ఊర్కోండలో అత్యధిక వర్షపాతం నమోదు

image

జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలో వర్షం కురిసింది. అత్యధికంగా ఊర్కొండలో 47.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెల్టుర్ 29.8, బొల్లంపల్లి 28.8, ఎల్లికల్ 25.3, తోటపల్లి 13.0, ఎంగంపల్లి 11.5, సిర్సనగండ్ల 7.5, కొల్లాపూర్ 1.8, తెలకపల్లి, జటప్రోలు 1.0, అత్యల్పంగా కల్వకుర్తి, కోడేర్‌లో 0.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

News October 10, 2025

ఖమ్మం: యూట్యూబ్‌లో చూసి హతమార్చారు..!

image

ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన వెంకటేశ్వర్లు(38) హత్య కేసును పోలీసులు ఛేదించారు. కామేపల్లి మండలం కెప్టెన్ బంజరకు చెందిన వెంకటేశ్వర్లును డబ్బు కోసమే ప్రధాన నిందితుడు అశోక్ కిరాతకంగా చంపినట్లు తేలింది. హత్యకు ముందు, మృతదేహాన్ని ముక్కలుగా నరికి పారేసే విధానాన్ని నిందితుడు యూట్యూబ్‌లో చూసి ప్లాన్ చేసుకున్నాడు. ఈ కేసులో అశోక్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎసీపీ తిరుపతి రెడ్డి తెలిపారు.