News March 24, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో 381.4 MM వర్షపాతం నమోదు

పార్వతీపురం మన్యం జిల్లాలో గడచిన 24 గంటల్లో 381.4 శాతం వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా పాలకొండ మండలంలో 67.8, వీరఘట్ట మండలంలో 55.4, పార్వతీపురం మండలంలో 49.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. అత్యల్పంగా సాలూరు మండలంలో 2.8 పాచిపెంట మండలంలో 3.2 MM వర్షపాతం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 25.4 శాతం వర్షపాతం పడింది.
Similar News
News October 13, 2025
కడప: అయ్యో రితిక్.. అప్పుడే నూరేళ్లు నిండాయా.!

కడపలో రైలు కింద పడి <<17990131>>కుటుంబం ఆత్మహత్య<<>> చేసుకున్న ఘటన కలచి వేస్తోంది. శంకరాపురానికి చెందిన శ్రీరాములు, భార్య శిరీష, 18 నెలల వయసు ఉన్న కుమారుడు రితిక్తో కలిసి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చిన్నారి రితిక్ మృతి చెందడం పలువురిని ఆవేదనకు గురి చేస్తుంది. అభం శుభం తెలియని వయసులో ఏం జరుగుతుందో తెలియక, తన తల్లి రైలు కిందకు ఎందుకు తీసుకుని వెళ్తుందో అర్థం కాక చిన్నారి మృతి చెందడం బాధాకరం.
News October 13, 2025
యాదాద్రి: అపూర్వం.. అత్తాకోడళ్ల ఆత్మీయ సమ్మేళనం

ఆత్మకూర్(M) మండల కేంద్రంలో కోరే వారి అత్తాకోడళ్ల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. దూర ప్రాంతాలకు చెందిన బంధువులందరినీ ఒకే చోట చేర్చి, కుటుంబ బంధాలను బలోపేతం చేశారు. ఈ సందర్భంగా పాత తరానికి చెందిన అత్తలు తమ అనుభవాలను, కష్టసుఖాలను కొత్త తరానికి చెందిన కోడళ్లకు తెలియజేశారు. వివిధ ప్రాంతాల నుంచి బంధువులు ఒకే వేదికపైకి రావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.
News October 13, 2025
RSS బ్యాన్ లెటర్పై దుమారం

బహిరంగ ప్రదేశాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలు నిషేధించాలని కర్ణాటక CM సిద్దరామయ్యకు మంత్రి ప్రియాంక్ ఖర్గే లేఖ రాశారు. స్కూళ్లు, పార్కులు, ప్లే గ్రౌండ్స్, మందిరాలు, పురాతన స్థలాలు తదితర చోట్ల RSS తమ శాఖలను నిర్వహిస్తోందని లేఖలో ప్రియాంక్ వివరించారు. సమాజంలో విభజనలు తీసుకొచ్చేలా ప్రచారం, నినాదాలు చేస్తోందని అభ్యంతరం తెలిపారు. అటు RSSను కాంగ్రెస్ ఏం చేయలేదని BJP మండిపడుతోంది.