News March 24, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో 381.4 MM వర్షపాతం నమోదు

పార్వతీపురం మన్యం జిల్లాలో గడచిన 24 గంటల్లో 381.4 శాతం వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా పాలకొండ మండలంలో 67.8, వీరఘట్ట మండలంలో 55.4, పార్వతీపురం మండలంలో 49.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. అత్యల్పంగా సాలూరు మండలంలో 2.8 పాచిపెంట మండలంలో 3.2 MM వర్షపాతం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 25.4 శాతం వర్షపాతం పడింది.
Similar News
News October 10, 2025
బాలికలకు స్కాలర్షిప్.. దరఖాస్తు చేసుకోండి

ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న గ్రామీణ పేద విద్యార్థినులకు విప్రో సంస్థ సంతూర్ ఉమెన్ స్కాలర్షిప్ను అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని ప్రభుత్వ కళాశాలల్లో చదివిన బాలికలు అర్హులు. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ ఫస్టియర్ చదువుతూ ఉండాలి. దరఖాస్తుకు చివరితేదీ అక్టోబరు 15. ఎంపికైనవారికి రూ.30వేలు అందుతుంది.
వెబ్సైట్: <
News October 10, 2025
ఖైరతాబాద్ పీసీసీ అబ్జర్వర్గా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షుల నియామక కసరత్తు వేగవంతమైంది. ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి వివిధ జిల్లాలకు పీసీసీ అబ్జర్వర్లను నియమించారు. ఇందులో భాగంగా, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఖైరతాబాద్ జిల్లా పీసీసీ అబ్జర్వర్గా నియమించారు.ఈ నెలాఖరులోగా అన్ని జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది.
News October 10, 2025
3,500 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

కెనరా బ్యాంకులో 3,500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి OCT 12 చివరితేదీ. APలో 242, TGలో 132 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ పాసైన 20-28ఏళ్ల వయస్కులు అర్హులు. ఎంపికైన అప్రెంటిస్లకు నెలకు రూ.15వేలు చెల్లిస్తారు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్లో ఎన్రోల్ చేసుకోవాలి. వెబ్సైట్: www.canarabank.bank.in
* ప్రతి రోజూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ కేటగిరీ<<>>కి వెళ్లండి.