News March 24, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో 381.4 MM వర్షపాతం నమోదు

పార్వతీపురం మన్యం జిల్లాలో గడచిన 24 గంటల్లో 381.4 శాతం వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా పాలకొండ మండలంలో 67.8, వీరఘట్ట మండలంలో 55.4, పార్వతీపురం మండలంలో 49.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. అత్యల్పంగా సాలూరు మండలంలో 2.8 పాచిపెంట మండలంలో 3.2 MM వర్షపాతం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 25.4 శాతం వర్షపాతం పడింది.
Similar News
News October 3, 2025
దేవరగట్టులో బన్ని జైత్రయాత్ర ప్రారంభం

కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో బన్ని జైత్రయాత్ర వైభవంగా ప్రారంభమైంది. దేవతామూర్తులు మాళమ్మ, మల్లేశ్వరస్వామి విగ్రహాలను దక్కించుకునేందుకు మూడు గ్రామాల భక్తులు ఒకవైపు, ఏడు గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడుతున్నారు. ఈ సమరాన్ని వీక్షించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. యాత్రను ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
News October 3, 2025
అరుదైన రికార్డు.. వరల్డ్ క్రికెట్లో ఒకే ఒక్కడు

భారత స్టార్ బౌలర్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పారు. విండీస్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసి భారత్లో వేగంగా 50 వికెట్లు పడగొట్టిన బౌలర్గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్(51), ఆస్ట్రేలియా(64), భారత్.. మూడు దేశాల్లో 50 వికెట్లు తీసిన ప్లేయర్గా బుమ్రా నిలిచారు. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లోని యాక్టివ్ ప్లేయర్లలో ఈ ఘనత సాధించింది అతనొక్కడే కావడం విశేషం.
News October 3, 2025
అక్టోబర్ 3: చరిత్రలో ఈరోజు

1903: స్వాతంత్ర్య సమరయోధుడు స్వామి రామానంద తీర్థ జననం(ఫొటోలో)
1954: నటుడు సత్యరాజ్ జననం
1968: రచయిత, నిర్మాత, దర్శకుడు ఎన్.శంకర్ జననం
1978: భారత్లో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ దుర్గా అగర్వాల్ జననం
1923: బ్రిటిష్ ఇండియా తొలి మహిళా పట్టభద్రురాలు, తొలి మహిళా వైద్యురాలు కాదంబినీ గంగూలీ మరణం(ఫొటోలో)
2006: సినీ నటి ఇ.వి.సరోజ మరణం
2013: తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం