News March 24, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో 381.4 MM వర్షపాతం నమోదు

image

పార్వతీపురం మన్యం జిల్లాలో గడచిన 24 గంటల్లో 381.4 శాతం వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా పాలకొండ మండలంలో 67.8, వీరఘట్ట మండలంలో 55.4, పార్వతీపురం మండలంలో 49.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. అత్యల్పంగా సాలూరు మండలంలో 2.8 పాచిపెంట మండలంలో 3.2 MM వర్షపాతం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 25.4 శాతం వర్షపాతం పడింది.

Similar News

News October 11, 2025

నేషనల్, ఇంటర్నేషనల్ అప్‌డేట్స్…

image

* ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ దేశ PMగా సెబాస్టియన్ లెకోర్నోను మళ్లీ నియమించారు. లెకోర్నో కేబినెట్ కూర్పు వివాదంతో 4 రోజుల క్రితం రాజీనామా చేశారు.
* చైనాపై ప్రస్తుత టారిఫ్‌లకు అదనంగా మరో 100% సుంకాలను విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అది అమెరికా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.
* పిల్లల మరణానికి కారణమైన కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్‌ను ఢిల్లీ ప్రభుత్వం నిషేధించింది.

News October 11, 2025

మొదటిసారి మేకప్ వేసుకుంటున్నారా?

image

కొత్తగా మేకప్ ప్రయత్నించాలనుకొనే వారికోసం ఈ చిట్కాలు. ముందు మీ స్కిన్ టైప్ ఏంటో గుర్తించాలి. డ్రై, ఆయిలీ, నార్మల్ ఇలా..దాన్ని బట్టి కాస్మెటిక్స్ ఎంచుకోవాలి. ముందు ముఖానికి మాయిశ్చరైజర్ రాయాలి. తర్వాత ఫౌండేషన్. ఇది మీ చర్మటోన్, టెక్స్‌చర్‌కు సరిపోయేలా ఉండాలి. డార్క్‌సర్కిల్స్‌కు కన్సీలర్ వాడాలి. కళ్లకు ఐలైనర్, కనురెప్పలకు మస్కారా, పెదాలకు లిప్‌లైనర్, లిప్‌స్టిక్ వేసుకోవాలి. <<-se>>#BeautyTips<<>>

News October 11, 2025

విశాఖలో సిఫీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

image

మంత్రి నారా లోకేశ్ రేపు విశాఖ రానున్నారు. ఉదయం 9 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుంచి రుషికొండకు వెళ్తారు. SIFY డేటా సెంటర్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడ నుంచి ఎన్‌టీఆర్ భవన్‌కు చేరుకొని ముఖ్య నేతలతో సమిక్షిస్తారు. సాయంత్రం మూడు గంటలకు మధురవాడ స్టేడియంకు వెళ్లి క్రికెట్ మ్యాచ్‌ను విక్షిస్తారు. రాత్రి 11:40కు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని విజయవాడ వెళ్తారు.