News March 24, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో 381.4 MM వర్షపాతం నమోదు

పార్వతీపురం మన్యం జిల్లాలో గడచిన 24 గంటల్లో 381.4 శాతం వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా పాలకొండ మండలంలో 67.8, వీరఘట్ట మండలంలో 55.4, పార్వతీపురం మండలంలో 49.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. అత్యల్పంగా సాలూరు మండలంలో 2.8 పాచిపెంట మండలంలో 3.2 MM వర్షపాతం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 25.4 శాతం వర్షపాతం పడింది.
Similar News
News October 7, 2025
వాల్మీకి జీవిత విశేషాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి: కలెక్టర్

మహర్షి వాల్మీకి జీవిత విశేషాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకొని విశాఖ జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మానవ జీవితానికి అనువైన విధంగా వాల్మీకి రామాయణాన్ని రచించి ఎన్నో విషయాలపై మహత్తర సందేశాన్ని అందించారని గుర్తు చేశారు.
News October 7, 2025
కనకాంబరం పూల సేకరణకు అనువైన సమయం ఏది?

తెలుగు రాష్ట్రాల్లో కనకాంబరం సాగు పెరిగింది. ఈ మొక్కలు నాటిన 2 నుంచి 3 నెలలకు పూత ప్రారంభమై, ఏడాది పొడవునా పూలు పూస్తాయి. జూన్ నుంచి జనవరి వరకు దిగుబడి ఎక్కువగా, వర్షాకాలంలో దిగుబడి కొద్దిగా తగ్గుతుంది. కనకాంబరం పూలను సరైన సమయంలో సేకరిస్తే అవి తాజాగా ఉండి మంచి ధర వస్తుంది. కనకాంబరం పూర్తిగా విచ్చుకోవడానికి రెండు రోజులు పడుతుంది. కాబట్టి రోజు విడిచి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పూలు కోయాలి.
News October 7, 2025
ప్రభుత్వంపై భ్రమలు తొలగిపోయాయి: జగన్

AP: కూటమి ప్రభుత్వంపై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని YSRCP చీఫ్ YS జగన్ పేర్కొన్నారు. ‘వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. అరాచకం, అవినీతి రాజ్యమేలుతోంది. పాలనపై ధ్యాస లేదు. తమ ఆదాయం పెంచుకోవాలన్న దానిపైనే కూటమి నేతలు దృష్టి పెట్టారు. రాష్ట్ర ఆదాయం పక్కదారి పట్టి చంద్రబాబు, లోకేశ్, బినామీల జేబుల్లోకి పోతున్నాయి. కూటమి తీరు దోచుకో పంచుకో తినుకో అన్నట్లుంది. అన్నింట్లోనూ అక్రమాలే’ అని ఆరోపించారు.