News March 24, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో 381.4 MM వర్షపాతం నమోదు

పార్వతీపురం మన్యం జిల్లాలో గడచిన 24 గంటల్లో 381.4 శాతం వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా పాలకొండ మండలంలో 67.8, వీరఘట్ట మండలంలో 55.4, పార్వతీపురం మండలంలో 49.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. అత్యల్పంగా సాలూరు మండలంలో 2.8 పాచిపెంట మండలంలో 3.2 MM వర్షపాతం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 25.4 శాతం వర్షపాతం పడింది.
Similar News
News October 9, 2025
లక్షల కోట్లు బూడిద చేశాడు

US కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ పాలిసేడ్స్లో చెలరేగిన కార్చిచ్చు ఉద్దేశపూర్వకంగా సృష్టించిందని అధికారులు వెల్లడించారు. ఈ కేసులో 29 ఏళ్ల జొనాథన్ రిండర్నెక్ట్ను అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరి 1న అతను పెట్టిన మంట లాస్ ఏంజెలిస్ చరిత్రలోనే భారీ అగ్నిప్రమాదంగా మారింది. ఈ మంటలకు 12 మంది ప్రాణాలు కోల్పోగా, 6,800 కట్టడాలు బూడిదయ్యాయి. దాదాపు 150 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.
News October 9, 2025
ఖమ్మం: కలప అక్రమ రవాణా ఇంటి దొంగల పనేనా?

ఖమ్మం జిల్లా అటవీ శాఖలో అక్రమ కలప రవాణా కలకలం రేపింది. అధికారుల అనుమతి లేకుండానే సండ్ర అడవి దాటిపోవడంలో ఇంటి దొంగల ప్రమేయం ఉందని ఉన్నతాధికారులు తేల్చారు. చింతకాని(M) నుంచి తరలించిన కలపకు ఫీల్డ్ వెరిఫికేషన్, వాల్టా ఫీజు లేకుండానే NOC జారీ చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈఘటనపై DFO సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే చింతకాని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ను సస్పెండ్ చేశారు.
News October 9, 2025
వనపర్తి: BE READY.. మరి కాసేపట్లో నామినేషన్ల ప్రక్రియ షురూ..!

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలి విడత జరిగే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు మరి కాసేపట్లో రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీల వారీగా ఓటరు జాబితాను ప్రదర్శిస్తారు. వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ఉదయం 10.30 నుంచి 5PM వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.