News March 24, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో 381.4 MM వర్షపాతం నమోదు

image

పార్వతీపురం మన్యం జిల్లాలో గడచిన 24 గంటల్లో 381.4 శాతం వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా పాలకొండ మండలంలో 67.8, వీరఘట్ట మండలంలో 55.4, పార్వతీపురం మండలంలో 49.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. అత్యల్పంగా సాలూరు మండలంలో 2.8 పాచిపెంట మండలంలో 3.2 MM వర్షపాతం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 25.4 శాతం వర్షపాతం పడింది.

Similar News

News October 9, 2025

7,267 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. PGT, TGT, వార్డెన్(M, F), స్టాఫ్ నర్స్(F) తదితర పోస్టులున్నాయి. ఉద్యోగాలను బట్టి PG, B.Ed, డిగ్రీ, BSc నర్సింగ్, ఇంటర్, టెన్త్ పాసైన వారు అర్హులు. చివరి తేదీ OCT 23. వెబ్‌సైట్: https://nests.tribal.gov.in
* ప్రతిరోజూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ కేటగిరీ<<>>కి వెళ్లండి.

News October 9, 2025

KMR: దాడులు జరుగుతున్నా..ఆగని పేకాట దందా!

image

కామారెడ్డి జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ, పేకాట రాయుళ్ల తీరు మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలో, పోలీసులు బుధవారం రాత్రి వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ మూడు కేసుల్లో మొత్తం రూ.33,690 నగదు స్వాధీనం చేసుకుని, నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పేకాటను ఎంతమాత్రం సహించేది లేదని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర స్పష్టం చేశారు.

News October 9, 2025

GNT: 400 కోట్ల స్కామ్.. జిల్లాలో ఐటీ రైడ్స్

image

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఐటీ దాడులు హాట్ టాపిక్‌గా మారాయి. గత కొన్నేళ్లుగా నకిలీ కందిపప్పు, పెసరపప్పు తయారీ చేస్తున్న పలు పప్పు మిల్లుల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రూ. 400 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించిన ఐటీ అధికారులు 30తో బృందాలు గుంటూరు, తెనాలి, వినుకొండ, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, ప్రాంతాల్లోని దాల్ మిల్లులు, ఏజెంట్ల ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు చేపట్టారు.