News March 24, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో 381.4 MM వర్షపాతం నమోదు

image

పార్వతీపురం మన్యం జిల్లాలో గడచిన 24 గంటల్లో 381.4 శాతం వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా పాలకొండ మండలంలో 67.8, వీరఘట్ట మండలంలో 55.4, పార్వతీపురం మండలంలో 49.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. అత్యల్పంగా సాలూరు మండలంలో 2.8 పాచిపెంట మండలంలో 3.2 MM వర్షపాతం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 25.4 శాతం వర్షపాతం పడింది.

Similar News

News November 12, 2025

వారితో మాకు సంబంధం లేదు: అల్ ఫలాహ్ యూనివర్సిటీ

image

ఢిల్లీ <<18265346>>ఎర్రకోట <<>>వద్ద పేలుడు కేసులో ప్రధాన నిందితులు అల్ ఫలాహ్ వర్సిటీ డాక్టర్లేనని అనుమానిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని వర్సిటీ VC భూపిందర్ కౌర్ తెలిపారు. డాక్టర్లు ముజామిల్, షాహీన్‌తో తమకు సంబంధం లేదన్నారు. ‘మేం ఎలాంటి రసాయనాలు నిల్వ చేయట్లేదు. ఉపయోగించట్లేదు. స్టూడెంట్ల అకడమిక్, ట్రైనింగ్ కోసం అవసరమైనంత వాడుతున్నాం’ అని పేర్కొన్నారు.

News November 12, 2025

HYD: రాష్ట్రంలో కాంగ్రెస్‌కి ఢోకా లేదు: TPPC

image

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఢోకా లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ అన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, టీపీసీసీగా తామే ఉంటామని చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుస్తామని, జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత లోకల్ బాడీ ఎన్నికలపై స్టడీ చేస్తామన్నారు. కాంగ్రెస్ మరో 10ఏళ్లు అధికారంలో ఉంటుందని, ఏ ఎలక్షన్ వచ్చినా గెలిచేది కాంగ్రెస్ అన్నారు.

News November 12, 2025

VZM: హోంగార్డ్స్ పిల్లలకు స్కాలర్‌షిప్‌లు

image

2023-24 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన 16మంది హెూంగార్డ్స్ పిల్లలకు రూ.2000 చొప్పున మెరిట్ స్కాలర్‌షిప్‌లు జిల్లా ఎస్పీ దామోదర్ తన కార్యాలయంలో నేడు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉన్నత విద్యతోనే భవిష్యత్తు బలపడుతుందని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువులో రాణించాలని సూచించారు. హెూంగార్డ్స్ సంక్షేమం కోసం ఇలాంటి ప్రోత్సాహకాలు కొనసాగుతాయని తెలిపారు.