News April 4, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో నేటి ఉష్ణోగ్రతల వివరాలు..

image

పార్వతీపురం జిల్లాలో శుక్రవారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని APSDM తెలిపింది. ఉదయం 10 తర్వాత బయటికొచ్చే వారంతా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సాలూరులో 37.1°C, మక్కువ 39.1, పాచిపెంట 36.8, కురుపాం 40.8, గరుగుబిల్లి 41.3, గుమ్మలక్ష్మీపురం 41.2, కొమరాడ 40.7, జియ్యమ్మవలస 41.2, పార్వతీపురం 40.3, సీతానగరం 40.6, బలిజిపేట 40.3, పాలకొండ 39.4, వీరఘట్టం 40.3, సీతంపేట 39, భామిలో 39.7గా నమోదౌతాయని తెలిపింది.

Similar News

News March 2, 2026

కుసుమ పంట కోత.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

యాసంగి పంటగా విత్తుకున్న కుసుమ.. నాటిన సమయాన్ని బట్టి ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది. కొన్నిచోట్ల ఇది కోత దశలో ఉంది. అయితే ఈ కుసుమ పంటను ఉదయాన్నే కోయడం వల్ల గింజలు రాలడం తక్కువగా ఉండటమే కాకుండా ముల్లు మొత్తగా ఉండి కోత ప్రక్రియ ఈజీగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పంట కోత తర్వాత గింజలలో తేమ 5 నుంచి 8 శాతానికి వచ్చేవరకు ఆరబెట్టాలి. దీని వల్ల గింజ నాణ్యత బాగుంటుందని తెలిపారు.

News March 2, 2026

ఏలూరు: అత్యాచారానికి పాల్పడిన యూట్యూబర్ అరెస్ట్

image

జంగారెడ్డిగూడెంలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడు సోషల్ యూట్యూబర్‌గా చలామణి అవుతూ, సహాయం కోసం వచ్చిన యువతిపై అత్యాచారం చేశాడని ఏఎస్పీ సుస్మిత రామనాథన్ వెల్లడించారు. ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా పోలీసులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

News March 2, 2026

ప్రభుత్వ ఉద్యోగులకోసం కొత్త చట్టం

image

TG: తలిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతం నుంచి 10-15% కోత పెట్టి వారికి చెల్లించేలా చట్టాన్ని ప్రభుత్వం రూపొందిస్తోంది. పేరెంట్స్ ఫిర్యాదులపై విచారణ చేసి నిజమని తేలితే వారి జాయింట్ ఖాతాలో ఈ సొమ్ము జమచేయనుంది. CS రామకృష్ణారావు, మాజీ CS శాంతికుమారిలతో కూడిన కమిటీ ముసాయిదా చట్టాన్ని రూపొందిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ఆమోదించనుంది. 2023 నుంచి నియమితులైన వారికి ఈ చట్టం వర్తించనుంది.