News January 31, 2025

పార్వతీపురం: మార్చి 8 వరకు మీ కోసం కార్యక్రమం రద్దు

image

జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్ కోడ్ జనవరి 30 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కోడ్ ముగిసినంత వరకు మీకోసం ( ప్రజా సమస్యల పరిష్కార వేదిక ) కార్యక్రమం నిలుపుదల చేయనున్నట్లు కలెక్టర్చ జిల్లా ఎన్నికల అధికారి ఎ. శ్యామ్ ప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి 8 ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తునట్లు ఆయన స్పష్టం చేశారు.

Similar News

News November 9, 2025

OTTల్లోకి మూడు రోజుల్లో 4 సినిమాలు

image

ఈ నెల 14-16 వరకు మూడు రోజుల వ్యవధిలో నాలుగు కొత్త సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘తెలుసు కదా’, ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘డ్యూడ్’, ధ్రువ్ విక్రమ్ ‘బైసన్’ మూవీలు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 14న స్ట్రీమింగ్ కానున్నాయి. రష్మిక, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘థామా’ ఈ నెల 16న ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది.

News November 9, 2025

విశాఖ: మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

image

విశాఖలో ఓ వివాహిత శనివారం ఆత్మహత్య చేసుకుంది. గోపాలపట్నం పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మినగర్‌కు చెందిన టి.రమ ఓ దుకాణంలో పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. ఎన్నిసార్లు నచ్చజెప్పినా మారలేదు. దీంతో మనస్తాపం చెంది శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని చనిపోయింది. ఆమె తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 9, 2025

పాలలో వెన్నశాతం పెరగాలంటే?(1/2)

image

పశువులకు ఇచ్చే దాణాలో కొబ్బరి చెక్క, పత్తి గింజల చెక్క, వేరుశనగ చెక్క, సోయాగింజల చెక్క, పొద్దు తిరుగుడు చెక్క వంటివి ఇవ్వాలి. పశువులకు అందించే మేతలో 1/3వ వంతు ఎండు గడ్డి ఉండాలి. పప్పు జాతి గ్రాసాలైన లూసర్న్, పిల్లి పెసర, జనుము తదితర వాటిని గడ్డి జాతి గ్రాసాలతో కలిపి ఇవ్వాలి. పశుగ్రాసాలను చాప్ కట్టర్ ద్వారా చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి ఇవ్వాలి. దాణాను వీలైనంత వరకు నానబెట్టి పశువుకు ఇవ్వాలి.