News July 29, 2024

పార్వతీపురం: మైనార్టీలకు టెట్, డీఎస్సీకి ఉచిత శిక్షణ

image

మైనార్టీ అభ్యర్థులకు టెట్, డీఎస్సీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందజేయడానికి చర్యలు చేపట్టామని మైనారిటీ సంక్షేమ శాఖ డీడీ సత్యనారాయణ రాజు తెలిపారు. ముస్లిం, క్రిస్టియన్ అభ్యర్థులకు ఈ శిక్షణ అందజేసేలా ప్రభుత్వం ఆదేశించిందన్నారు. విశాఖలోని ఆర్.సి.ఈ.డి.ఎం. సిరిపురంలో శిక్షణ అందించేందుకు చర్యలు చేపట్టమన్నారు. మరిన్ని వివరాలకు 90523 42344 సంప్రదించాలన్నారు.

Similar News

News November 18, 2025

10వ తరగతి ఫలితాల్లో జిల్లా ముందజలో ఉండాలి: కలెక్టర్

image

పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ముందంజలో నిలవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన విద్యా శాఖ సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. తక్కువ ప్రగతి చూపుతున్న విద్యార్థులను గుర్తించి అదనపు బోధన అందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు మించి ర్యాంకులు సాధించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.

News November 18, 2025

VZM: ‘రైతుల ఖాతాల్లో రూ.150 కోట్లు జమ’

image

సుఖీభవ-పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధులను బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చంద్రబాబు జమ చేయనున్నారని కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాలో 2,27,700 మంది రైతుల ఖాతాల్లో రూ.150.03 కోట్లు జమ కానున్నాయి. అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి రూ.7,000 (సుఖీభవ రూ.5వేలు, పీఎం కిసాన్ రూ.2వేలు ) చొప్పున జమ అవుతుందని తెలిపారు.

News November 18, 2025

VZM: కలెక్టర్ ఆగ్రహం.. ముగ్గురు సచివాలయ సిబ్బందికి నోటీసులు

image

రామభద్రపురం సచివాలయాన్ని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టి, సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న పలు సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. తనిఖీ సమయంలో కొంతమంది సిబ్బంది నిర్దేశిత సమయానికి హాజరు కాకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆయన ఆదేశించారు.