News August 6, 2024
పార్వతీపురం యువకునికి 20ఏళ్ల జైలుశిక్ష

అనకాపల్లి జిల్లాకు చెందిన అమ్మాయిని మోసగించిన కేసులో పార్వతీపురానికి చెందిన పి.సాయి మనోజ్ కుమార్కు 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ విజయనగరం పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. శిక్షతో పాటు రూ.5,500 జరిమానా విధించింది. భోగాపురం సమీపంలో చదువుతున్న రోజుల్లో సాయి మనోజ్తో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు స్థానిక పోలీసుస్టేషన్లో ఆమె కేసు పెట్టింది.
Similar News
News January 3, 2026
రేపే భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్

భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి గగన విహార ముహూర్తం ఖరారైంది. ఆదివారం ట్రయల్ రన్గా ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా తొలి విమానం భోగాపురంలో ల్యాండ్ కానుంది. ఆ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రానున్నారు. ట్రయల్ రన్ విజయవంతమైతే మే నెల నుంచే సాధారణ విమాన సర్వీసులు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టనున్నారు.
News January 3, 2026
బొండపల్లిలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

బొండపల్లి మండలం, మరువాడ గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం పాల్గొన్నారు. రైతుల భూ హక్కులు స్పష్టంగా నమోదై, భవిష్యత్లో ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఉండేలా ఈ విధానం రూపకల్పన చేశామన్నారు. క్యూ ఆర్ కోడ్ కలిగిన ఆధునిక పాస్ పుస్తకాలు ప్రభుత్వ రాజముద్రతో అందిస్తున్నామని చెప్పారు.కార్యక్రమంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పాల్గొన్నారు.
News January 3, 2026
VZM: కేజీబీవీ నోటిఫికేషన్.. జిల్లాలో ఖాళీల వివరాలు

AP KGBV ఔట్సోర్సింగ్లో 1095 పోస్టులకు <


