News June 15, 2024

పార్వతీపురం – రాజమండ్రి అదనపు బస్సు సర్వీసులు

image

పార్వతీపురం నుంచి రాజమండ్రికి వెళ్లే ప్రయాణికుల కోసం కొత్తగా రెండు అదనపు బస్సు సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆర్టీసీ డీఎం కనకదుర్గ తెలిపారు. ఇప్పటివరకు పార్వతీపురం నుంచి విజయవాడకు మూడు అల్ట్రా డీలక్స్ బస్సులను నడుపుతున్నామని తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.

Similar News

News December 4, 2025

VZM: హోంమంత్రి అధ్యక్షతన నేడు DRC సమావేశం

image

విజయనగరం కలెక్టరేట్‌లో బుధవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మినిస్టర్ వంగలపూడి అనిత అధ్యక్షత వహించనున్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ శాఖల ప్రగతి, ప్రజా సేవల అమలు స్థితి, సంక్షేమ పథకాల పురోగతి వంటి అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించనున్నారు.

News December 4, 2025

స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ప్రభుత్వ పరంగా జిల్లాలో ఎటువంటి స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు కానప్పటికి ఇతర జిల్లాలలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి బుధవారం సూచించారు. వైద్య అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రజలందరూ ఆందోళన చెందవద్దని, అనుమానం ఉంటే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటే సులభంగా బయటపడవచ్చన్నారు.

News December 4, 2025

స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ప్రభుత్వ పరంగా జిల్లాలో ఎటువంటి స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు కానప్పటికి ఇతర జిల్లాలలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి బుధవారం సూచించారు. వైద్య అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రజలందరూ ఆందోళన చెందవద్దని, అనుమానం ఉంటే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటే సులభంగా బయటపడవచ్చన్నారు.