News February 1, 2025

పార్వతీపురం : రిజిస్ట్రేషన్ల‌పై పెంచిన ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి

image

రిజిస్ట్రేషన్ల‌పై పెంచిన ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని జిల్లా రిజిస్ట్రార్ రామలక్ష్మీ పట్నాయక్ తెలిపారు. రూరల్, అర్బన్, వాణిజ్య ప్రాంతాన్ని బట్టి ఒక్కో విధంగా ధరలు ఉంటాయని చెప్పారు. పార్వతీపురం నియోజకవర్గంలో 2-10 శాతం, పాలకొండ నియోజకవర్గం లో 30-40, కురుపాం నియోజకవర్గంలో 13 -40 శాతం, సాలూరు నియోజకవర్గం లో 16- 20 శాతం ఛార్జీలు పెరిగాయన్నారు. నేటి నుంచి అమల్లోకి వస్తాయన్నారు.

Similar News

News October 28, 2025

‘జగిత్యాలకు రూ.62.50 కోట్ల అభివృద్ధి నిధులు’

image

JGTL మున్సిపాలిటీకీ అత్యధికంగా రూ.62.50 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ప్రెస్ మీట్‌లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. CMను కలిసి వినతిపత్రం ఇచ్చిన వెంటనే నిధులు ఆమోదించారని చెప్పారు. ఇప్పటికే కరెంట్, డ్రైనేజీ, రోడ్లు, నీటి సరఫరా పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అర్బన్ హౌసింగ్ కాలనీకి రూ.20 కోట్లు ప్రతిపాదనలు పంపామని, జగిత్యాల జిల్లా అభివృద్ధిలో TGకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

News October 28, 2025

SRPT: ‘సమాజంలో శాస్త్రీయ వైఖరులు పెంపొందించాలి’

image

సమాజంలో శాస్త్రీయ వైఖరులు పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా అడిషనల్ కలెక్టర్ సీతారామారావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో చెకుముకి సైన్స్ సంబరాల గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. మూఢ నమ్మకాలను పారద్రోలి శాస్త్రీయ వైఖరులను పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు, సభ్యులు రామచంద్రయ్య దయానంద్ ఉన్నారు.

News October 28, 2025

పెద్దపల్లి యార్డులో పత్తికి గరిష్టంగా రూ.6,788 ధర

image

పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మంగళవారం పత్తి ధర స్వల్పంగా తగ్గింది. సోమవారం క్వింటాల్ పత్తి ధర 7,017 పలకగా, మంగళవారం పత్తి క్వింటాల్ కు రూ.6788 పలికినట్లు తెలిపారు. ఈ రోజు గరిష్టంగా రూ.6,788, కనిష్టంగా రూ.5,371, సగటు ధర రూ.6,571గా నమోదైంది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 321 మంది రైతులు తీసుకువచ్చిన 907.20 క్వింటాల్ పత్తిని కొనుగోలు చేసినట్లు మార్కెట్ ఇన్‌చార్జి కార్యదర్శి మనోహర్ తెలిపారు.