News March 14, 2025

పార్వతీపురం: రేపటి నుంచి ఒంటిపూట బడులు

image

రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయని డీఈఓ ఎన్. తిరుపతి నాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. రేపటి నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు ఉంటాయన్నారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్న పాఠశాలల్లో పరీక్షలు ముగిసేంతవరకు మధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు ఉంటాయన్నారు.

Similar News

News April 14, 2026

image

https://d29i5havsxvi1j.cloudfront.net/sticky_jsps/result_whatsap_push.jsp?token={TOKEN}

News April 14, 2026

ఒంటిమిట్టలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత

image

AP: కడప(D) ఒంటిమిట్టలో ఇవాళ 45°C ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల(D) సంజామల 44.2°C, తిరుపతి(D) వరదయ్యపాలెంలో 43.8°C ఉష్ణోగ్రత నెలకొంది. 262 మండలాల్లో 40°Cలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు SDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో 42-44°C మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయన్నారు. ఉత్తరాంధ్రలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఎండతీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News April 14, 2026

కొవిడ్ వ్యాక్సిన్‌తోనే నాన్న చనిపోయారు: వార్న్ కుమారుడు

image

స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మరణానికి కారణం కరోనా వ్యాక్సిన్ అని ఆయన కుమారుడు జాక్సన్ వార్న్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాక్సిన్‌‌తో తన తండ్రి అనారోగ్య సమస్యలు ముదిరాయని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. ఇష్టం లేకపోయినా ఇతరుల ఒత్తిళ్లతో ఆయన టీకా డోసులు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని అంత్యక్రియలప్పుడే చెప్పాలని అనుకున్నా కొన్ని కారణాలతో ఆగిపోయానని అన్నారు. కాగా షేన్ వార్న్ 2022లో చనిపోయారు.