News January 8, 2025
పార్వతీపురం: ‘వడ్డీలేని పంట రుణాలపై అవగాహన కల్పించాలి’

వచ్చే ఖరీఫ్ సీజన్కు రైతులకు లక్షలోపు వడ్డీ లేని పంట రుణాలు అందించనున్నందున పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బ్యాంక్ అధికారులు, పలు శాఖల అధికారులతో డీసీసీ అండ్ జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు.
Similar News
News October 19, 2025
VZM: నిబంధనలు పాటించని బాణాసంచా వ్యాపారులు

నగరంలోని బాణాసంచా షాపు యజమానులు అగ్నిమాపక నిబంధనలు పాటించడం లేదు. KL పురంలో అధికారికంగా 8 షాపులు ఉండగా, తాత్కాలిక అనుమతులతో మరో 15 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ మంటలు చెలరేగితే ఆర్పేలా సంబంధిత పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే ఇక్కడ 25వేల లీటర్ల నీటి సామర్ధ్యంతో ఒక సంపు, నిర్మించుకోవాలి. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాల్సిన అగ్నిమాపక అధికారులు అటు వైపు చూడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
News October 18, 2025
VZM: ‘బాల, బాలికలకు సమాన అవకాశాలు’

అన్ని రంగాల్లో బాల, బాలికలకు నేడు సమాన అవకాశాలు ఉన్నాయని జిల్లా వైద్యారోగ్య అధికారిణి జీవనరాణి అన్నారు. సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఘోషాసుపత్రిని శనివారం సందర్శించారు. రెండో సంతానంగా ఆడబిడ్డలు పుట్టిన బాలింతల వద్దకు వెళ్లి లింగ వివక్షతపై అవగాహన కల్పించారు. బాలికలను చక్కగా చదివించాలని, నేడు అన్ని రంగాల్లో మహిళలదే పైచేయి అని తెలిపారు. లింగ వివక్షత చూపిస్తే చర్యలు తప్పవన్నారు.
News October 18, 2025
మిగిలిన బాణసంచాను జాగ్రత్తగా భద్రపరచాలి: SP

దీపావళి సందర్భంగా కేఎల్పురం శివార్లలో ఏర్పాటు చేసిన బాణసంచా షాపులను ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఆకస్మికంగా పరిశీలించారు. వ్యాపారులు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, షాపుల వద్ద నీరు, ఇసుక అందుబాటులో ఉంచాలని సూచించారు. గడువు ముగిసిన తరువాత మిగిలిన బాణసంచాను సురక్షిత గోడౌన్లలలో భద్రపర్చాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.