News March 12, 2025
పార్వతీపురం: వన్యప్రాణులకు తాగునీటి ఏర్పాట్లు

వేసవికాలంలో వన్యప్రాణులు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అటవీ ప్రాంతంలో తాగునీటి కుంటలను ఏర్పాటు చేస్తున్నట్లు పార్వతీపురం అటవీ శాఖ రేంజర్ బిర్లంగి రామ్ నరేశ్ తెలిపారు. మంగళవారం కొమరాడ మండలంలో సరుగుడు గూడ అటవీ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ పరిశీలనలో కొమరాడ అటవీ శాఖ సెక్షన్ అధికారి బీట్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 15, 2025
జూబ్లీహిల్స్: స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి పోలైన ఓట్లు 1,608

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలవగా అందులో 29 మంది స్వతంత్రులు ఉన్నారు. పోటీ చేసిన వారిలో 10 మందికి పైగా నిరుద్యోగులున్నారు. వారంతా రెండంకెల ఓట్లకే పరిమితమయ్యారు. స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి పోలైన ఓట్లు 1,608. బరిలో నిలిచిన వారిలో 41 మంది అభ్యర్థులకు రెండంకెల ఓట్లు, ఒక స్వతంత్ర అభ్యర్థికి 9 ఓట్లు పోలయ్యాయి.
News November 15, 2025
సిరిసిల్ల: రాజీవ్ యువ వికాసం కోసం ఎదురుచూపులు

సిరిసిల్ల జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణం కోసం దరఖాస్తు చేసుకున్న యువతకు నిరీక్షణ తప్పడం లేదు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాలకు మొత్తం 7,680 యూనిట్లు కేటాయించగా, 7,121 మంది అర్హులను ఎంపిక చేశారు. వీరికి స్వయం ఉపాధి కోసం రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణం ఇవ్వాలని నిర్ణయించారు. ఆరు నెలలు గడుస్తున్నా రుణం అందకపోవడంతో యువతలో నిరాశ నెలకొంది.
News November 15, 2025
ములుగు: నెక్స్ట్ దామోదరేనా..!?

జిల్లాకు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ నేత తక్కల్లపల్లి వాసుదేవరావు @ ఆశన్న ఇటీవల లొంగిపోయారు. తాజాగా రాష్ట్ర నేత కొయ్యడ సాంబయ్య @ఆజాద్ పోలీసులకు పట్టుబడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ములుగులో మిగిలింది బడే చొక్కారావు @దామోదర్ ఒక్కరే. రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన చాలాకాలంగా పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్లో పార్టీ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.


