News March 26, 2025
పార్వతీపురం: విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఆకతాయికి దేహశుద్ధి

పార్వతీపురం మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆకతాయికి తల్లిదండ్రులు, యువకులు కలిసి దేహశుద్ధి చేశారు. బుధవారం సాయంత్రం ఈ సంఘటన జరగగా విషయం తెలుసుకున్న ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి రవికుమార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
Similar News
News April 24, 2025
కడప: నోటిఫికేషన్ విడుదల

ఏపీలో టెన్త్ ఫలితాలు వెలువడడంతో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT- AP) పరిధిలోని ఒంగోలు, ఇడుపులపాయ ఐఐఐటీలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ను ఆర్జీయూకేటీ అధికారులు విడుదల చేశారు. ఈనెల 27న ఉ. 10 గంటల నుంచి మే 20వ తేదీ సా. 5 గంటల వరకు దరఖాస్తు గడువు ఉంటుందన్నారు. అర్హులైన విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News April 24, 2025
చిత్తూరు: ఇంటర్ ఫస్ట్ ఇయర్కు కొత్త సిలబస్

2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్కు నూతన సిలబస్ను ప్రవేశపెడుతున్నట్లు DIEO శ్రీనివాస్ గురువారం తెలిపారు. కన్నన్ కళాశాలలో అధ్యాపకులకు దీనిపై ఓరియంటేషన్ తరగతులు ప్రారంభించామన్నారు. ప్రతి ఒక్క అధ్యాపకుడు ఈ తరగతులకు హాజరై నూతన సిలబస్పైన అవగాహన పెంచుకోవాలన్నారు. కళాశాల పునఃప్రారంభం నాటికి నూతన పుస్తకాలు అందుబాటులోకి తెస్తామన్నారు.
News April 24, 2025
సిరిసిల్ల: వరి ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి: కలెక్టర్

యాసంగి పంట కొనుగోలులో వేగం పెంచాలని, కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన వరి ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. మాట్లాడుతూ.. రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరగాలని అన్నారు. డీఆర్డిఓ శేషాద్రి, తదితరులున్నారు.