News September 11, 2024
‘పార్వతీపురం-విశాఖ మధ్య షటిల్ సర్వీస్ రైలు నడపాలి’

పార్వతీపురం-విశాఖ మధ్య షటిల్ సర్వీస్ ట్రైన్ నడపాలని సీపీఎం బొబ్బిలి పట్టణ కార్యదర్శి పి.శంకర్రావు డిమాండ్ చేశారు. పార్వతీపురం, బొబ్బిలి నుంచి విజయనగరం, విశాఖకు విద్యార్థులు, ఉద్యోగస్థులు, వైద్యం కోసం ప్రతీ రోజూ వేలాది మంది రైలు ప్రయాణం చేస్తున్నారన్నారు. కానీ, సరిపడా ట్రైన్లు లేవన్నారు. ఉన్న ఒకటి రెండు రైళ్లలో కిక్కిరిసి, ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారన్నారు.
Similar News
News February 23, 2026
VZM: ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా కె.ఎల్.పురంలోని శ్రీ లక్ష్మీగణపతి జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆయన సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న గదులను సందర్శించి, వారికి కల్పించిన వసతులపై అధికారులను ఆరా తీశారు.
News February 23, 2026
అమృత్ భారత్ రైళ్లకు కొత్తవలసలో హాల్ట్

కొత్తవలస రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ పథకంలో చేర్చడంతో పలు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించినట్లు వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ పవన్ కుమార్ తెలిపారు. 16597/98, 16223/24, 16107/08, 16523/24 ఈ రైళ్లు కొత్తవలస, దువ్వాడ మీదుగా గమ్యస్థానాలకు చేరుకుంటాయన్నారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News February 23, 2026
అమృత్ భారత్ రైళ్లకు కొత్తవలసలో హాల్ట్

కొత్తవలస రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ పథకంలో చేర్చడంతో పలు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించినట్లు వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ పవన్ కుమార్ తెలిపారు. 16597/98, 16223/24, 16107/08, 16523/24 ఈ రైళ్లు కొత్తవలస, దువ్వాడ మీదుగా గమ్యస్థానాలకు చేరుకుంటాయన్నారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


