News March 11, 2025
పార్వతీపురం: వెనుకబడిన తరగతులు, అగ్రవర్ణాల పేదలకు స్వయం ఉపాధి పథకాలు

జిల్లాలోని దారిద్ర్య రేఖకు దిగువనున్న వెనుకబడిన తరగతులు, అగ్రవర్ణాల్లోని పేదల అభివృద్ధి కోసం స్వయం ఉపాధి పథకం కింద యూనిట్ల స్థాపన, జెనరిక్ ఫార్మసీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2024-25 ఆర్థిక సం.రంలో 21 నుంచి 60 ఏళ్ల వయసు ఉండి, దారిద్ర్య రేఖకు దిగువనున్న వెనుకబడిన తరగతుల వారి అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు.
Similar News
News December 9, 2025
సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళాలు ఇవ్వండి: కలెక్టర్

సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ప్రతి ఒక్కరూ ఉదారంగా విరాళాలు అందించాలని కలెక్టర్ విజయ్ కృష్ణన్ పిలుపునిచ్చారు. మంగళవారం అనకాపల్లి కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా సైనిక సంక్షేమ వింగ్ కమాండర్ చంద్రశేఖర్తో కలిసి గోడపత్రికను ఆవిష్కరించారు. సైనిక సంక్షేమ భవన నిర్మాణకి 70 సెంట్లు భూమి కేటాయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. యుద్ధ వీరులకు 300 గజాలు ఇస్తామన్నారు.
News December 9, 2025
పాడేరు: ‘మ్యూటేషన్, రీసర్వే ప్రక్రియ పూర్తి చేయాలి’

రీసర్వే, మ్యూటేషన్ ప్రక్రియలో అలసత్వం చేయకుండా చూడాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. డీ పట్టా భూమి, ఆర్ఓఎఫ్ఆర్ భూమి, జిరాయితీ భూమిలో పంట పండించే ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం అందేలాగా చూడాలని సూచించారు. రీసర్వే చేసినప్పుడు ప్రభుత్వ భూములు, D-పట్టా భూమి పూర్తిగా పరిశీలించి వెబ్ల్యాండ్ సబ్ డివిజన్ చేయాలన్నారు.
News December 9, 2025
ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గల ఎన్నికల ఈవీఎం గోదాంను కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం పలు రాజకీయ పార్టీల నాయకులతో కలిసి తనిఖీ చేశారు. సాధారణ తనిఖీలో భాగంగానే దీనిని పరిశీలించినట్లు కలెక్టర్ తెలిపారు. గోదాంకు పటిష్ట భద్రత కల్పించాలని, నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. తనిఖీ అనంతరం ఆయన లాక్ బుక్లో సంతకం చేశారు.


