News March 29, 2025
పార్వతీపురం: శాశ్వత లోక్ అదాలత్పై అవగాహనా సదస్సు

ప్రజా ప్రయోజన సేవలకు సంబంధించి శాశ్వత లోక్ అదాలత్ ఆవశ్యకత, సామర్ధ్యం పెంపుదల, కేసుల పరిష్కార విధానం, సామర్ధ్య పెంపుదల మార్గాలు, వివాదాలను పరిష్కరించే అధికారం శాశ్వత లోక్ అదాలత్కు ఉందని రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు పేర్కొన్నారు. శనివారం జిల్లా కోర్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పారా లీగల్ వాలంటీర్ల శిక్షణా సమావేశంలో పాల్గొన్నారు. శాశ్వత లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని సూచించారు.
Similar News
News November 21, 2025
యూనస్ టచ్ కూడా చేయలేడు: షేక్ హసీనా కొడుకు

బంగ్లాదేశ్లో రాజ్యాంగవిరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా కొడుకు సజీబ్ వాజెద్ అన్నారు. ‘యూనస్ నా తల్లిని చంపలేరు. కనీసం టచ్ కూడా చేయలేరు. బంగ్లాలో చట్టబద్ధమైన పాలన వచ్చిన తర్వాత అంతా మారిపోతుంది’ అని చెప్పారు. 140 రోజుల్లోనే విచారణ పూర్తి చేశారని, న్యాయ ప్రక్రియను పూర్తిగా అపహాస్యం చేశారని మండిపడ్డారు. హసీనాకు <<18311087>>మరణశిక్ష <<>>విధిస్తూ ICT తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
News November 21, 2025
VKB: చలి దాడి ఎంతంటే.. పార్కులో కొంగ కూడా వణికింది!

వికారాబాద్లో ఉదయం వేళ చలి తీవ్రత పెరగడంతో పక్షులూ కూడా ఇబ్బంది పడుతున్నాయి. పట్టణంలోని ఒక పార్క్లో తెల్ల కొంగ (ఎగ్రెట్) చలికి వణుకుతున్న దృశ్యం కెమెరాలో రికార్డైంది. చెట్ల నీడలో నిలబడి చలి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న ఈ పక్షిని చూసి అక్కడి ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ దృశ్యం స్థానికులను కలచివేసింది. చలి తీవ్రత జీవజాలంపై ఎంత ప్రభావం చూపుతోందో ఈ ఉదయం దృశ్యం స్పష్టంగా తెలియజేస్తోంది.
News November 21, 2025
నిర్మల్ జిల్లాకు రూ.కోటి రివార్డు

జాతీయ స్థాయి జల అవార్డుల్లో భాగంగా దక్షిణాది రాష్ట్రాల విభాగంలో నిర్మల్ జిల్లా రెండవ స్థానంలో నిలవడం గర్వకారణమని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లాకు రూ. కోటి రివార్డు లభించడం విశేషమని తెలిపారు. అధికారుల సమిష్టి కృషి, ప్రజల విలువైన భాగస్వామ్యంతోనే ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో పని చేసి, జిల్లాకు మరిన్ని ప్రతిష్టాత్మక అవార్డులు సాధించేందుకు కృషి చేయాలన్నారు.


