News April 16, 2025
పార్వతీపురం: సమ్మర్ హాలీడేస్లో వీటిపై ఓ లుక్కేయండి

వేసవి సెలవులకు పార్వతీపురం మన్యం జిల్లా స్వాగతం పలుకుతుంది. సెలవుల్లో కుటుంబ సమేతంగా వచ్చిన వారికి పర్యాటక ప్రాంతాలు వేదిక కానున్నాయి. సీతంపేట అడ్వెంచర్ పార్క్, తోటపల్లి ఐటీడీఏ పార్కు, సీతంపేట కడలి వ్యూ పాయింట్, తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, విశ్వేశ్వర దేవాలయం వంటి మరెన్నో పర్యాటక ప్రాంతాలను సందర్శించి మన్యం అందాల మధ్య ఆహ్లాదం పొందవచ్చు.
Similar News
News November 21, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 11

62. డంభం అంటే ఏమిటి? (జ.తన గొప్ప తానే చెప్పుకోవటం)
63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (జ.తన భార్యలో, తన భర్తలో)
64. నరకం అనుభవించే వారెవరు? (జ.ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు)
65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (జ.ప్రవర్తన మాత్రమే)
66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (జ.మైత్రి)
<<-se>>#YakshaPrashnalu<<>>
News November 21, 2025
కగార్ ఎఫెక్ట్.. కలిసిపోతారా..? కొనసాగుతారా..?

ఆపరేషన్ కగార్ పేరిట వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఉమ్మడి కరీంనగర్(D) మంథని ప్రాంతం నుంచి మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మల్లా రాజిరెడ్డి @ సత్తెన్న సురక్షితంగానే ఉన్నారా? అనే చర్చ జరుగుతోంది. 1975లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన హిడ్మా ఎన్కౌంటర్, అనారోగ్యంతో పోలీసులకు లొంగిపోతారా? ఉద్యమం సాగిస్తరా? అనేది చూడాలి.
News November 21, 2025
శబరిమలై యాత్రికుల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి: డీటీవో

శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో డ్రైవర్లు మెళకువలు పాటిస్తూ వాహనాలు నడపాలని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సూచించారు. శబరిమలై యాత్రికులతో ఆర్టీసీ, ట్రావెల్స్ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు జిల్లా నుంచి తరలి వెళ్తున్నందున డ్రైవర్లు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. మంచు కురిసే సమయాల్లో డ్రైవింగ్ చేయవద్దని, సుదూర ప్రయాణాల్లో తప్పనిసరిగా వాహనంలో ఇద్దరు డ్రైవర్లు ఉండాలని ఆయన ఆదేశించారు.


