News January 30, 2025
పార్వతీపురం: ‘సైబర్ నేరాలు తగ్గించేలా చర్యలు చేపట్టాలి’

సైబర్ నేరాలు తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఎస్. వి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం జూమ్ మీటింగ్ ద్వారా నేర సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సైబర్ నేరాలు తగ్గించే విధంగా ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టాలని విధిగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సైబర్ నేరాలు జరిగినట్లయితే తక్షణమే వారికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.
Similar News
News December 2, 2025
జగిత్యాల: సర్పంచ్ స్థానాలకు 508 నామినేషన్లు: కలెక్టర్

జగిత్యాల జిల్లాలో రెండవ విడత 7 మండలాల్లో రెండవ రోజు నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియలో సర్పంచ్ స్థానాలకు 508 నామినేషన్లు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. అలాగే వార్డు మెంబర్ స్థానాలకు 1279 నామినేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు. సర్పంచ్ స్థానాలకు బీర్పూర్-43, జగిత్యాల-24, జగిత్యాల(R)-103, కొడిమ్యాల-99, మల్యాల-72, రాయికల్-106, సారంగాపూర్-61 నామినేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు.
News December 2, 2025
జగిత్యాల: ‘ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగాలనే రాండమైజేషన్’

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది 2వ రాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ సత్యప్రసాద్ సోమవారం జగిత్యాల కలెక్టరేట్ లో జనరల్ అబ్జర్వర్ రమేష్ తో కలిసి నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగాలనే ఉద్దేశంతో రాండమైజేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నమన్నారు. అడిషనల్ కలెక్టర్ తదితరులున్నారు.
News December 2, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో సోమవారం వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.1911, కనిష్ఠ ధర రూ.1725; వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2090, కనిష్ఠ ధర రూ.2000; వరి ధాన్యం (BPT) గరిష్ఠ ధర రూ.2201, కనిష్ఠ ధర రూ.2131; వరి ధాన్యం (HMT) గరిష్ఠ ధర రూ.2301, కనిష్ఠ ధర రూ.2281; వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.3011, కనిష్ఠ ధర రూ.2130గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.


